Telugu Sunday Schools

Wondurfull Skits

Audios

2.Sundayschool Audio Songs

Videos

3.Dance Videos,Action Songs

Stories

4.sub junirs,juniors,seiors,youth all type of stories

Please Subcribe Our Youtube Channel

5.Video Songs,Skits,Movies,ShortFilms....

Friday, 4 December 2015

Ankitam Short Film


Monday, 30 November 2015

నిత్య జీవము నిత్య నరకము స్కిట్

 

Download pdf

Nithya Jeevamu Nithya Narakamu Skit

 నిత్య జీవము నిత్య నరకము స్కిట్










విడుదల స్కిట్

Vidudala Skit single pdf file  Download













Thursday, 26 November 2015

Singer Chitra Christian Telugu Sunday School Christmas Song (Jesus Birth Song)

Singer Chitra Christian Telugu Sunday School Christmas Song (Jesus Birth Song)

యదార్థ సత్యము - జాక్ పూనెన్

యదార్థ సత్యము - జాక్ పూనెన్ - Ral Truth - Zac Poonen


1. చెడును గూర్చిన యదార్థమైన సత్యము
ప్రపంచములోని ప్రజలు ప్రయాసపడి తెలిసుకోవటానికి ప్రయత్నించిన గొప్ప మర్మాలలో చెడును గూర్చిన మర్మమొకటి. సర్వజ్ఞుడైన మంచి దేవునిచే సృష్టింపబడిన లోకంలో చెడు ఏ విధంగా మొదలైంది ?

లోకంలో ప్రతిచోటా చెడుదే పైచేయి ఎలా అయింది ? ఎందువలన ప్రతిచోటా రోగము, పేదఱికము, దుఃఖము మరియు బాధ ఉన్నాయి ? దేవుడు మనకు సహాయము చేయటానికి ఆసక్తిగా లేడా ? ఈ ప్రశ్నలకు జవాబు కావాలి. వీనికి బైబిలు సమాధానమిస్తుంది. వీటిని గూర్చి తెలుసు కొనుటకు ముందు మనము దేవుని గూర్చి కొన్ని ముఖ్యమైన వాస్తవాలను తెలిసికొందము.

దేవుడు శాశ్వత కాలము నుండి ఉన్నవాడు. ఆయనకు ఆరంభం అనేది లేదు. ఆయన మన మెరిగిన కాల పరిమితులకు మించి ఉన్నవాడు, కనుక ఆయనకు ఆరంభం లేదు. ఆ విషయం మనము అర్థం చేసికోవడం కష్టం.

బైబిలులో మొదటి వాక్యం ఇలా ప్రారంభమౌతుంది.

ఆదియందు దేవుడు .. ( ఆదికాండము 1 వ అధ్యాయము 1 వ వచనము)* (ఆదికాండము అనునది దేవుని వ్యాక్యమైన బైబిలులో నున్న 66 పుస్తకాలలో మొదటిది. ఈ పుస్తకంలో బ్రాకెట్టులలో వ్రాయబడినది బైబిలులో నుండిన ఏదో ఒక పుస్తకములోనిది.)

దేవుడు నిత్యత్వంలో గతకాల మంతటి నుండి ఉన్నాడనే నిజాన్ని వివరించడానికి బైబిలు ప్రయత్నించదు. అది వాస్తవ విషయముగా మాత్రమే చెబుతుంది.

మానవమాత్రులమైన మనతో దేవుడు వ్యక్తిగత సంబంధం కోరుచున్నట్లు బైబిలు తెలియజేస్తుంది. మనము మనుష్యులను అర్థము చేసుకొనే రీతిని దేవుని అర్థము చేసుకోవటానికి, ఆయన యొక మనిషి కాదు. ఆయన అంచంచల గుణశీలములు మరియు నిత్యమైన మార్గములు కల ఆత్మ స్వరూపి మరియు ఆయన ఎప్పుడును మార్పులేనివాడు. ఆయన సర్వశక్తిమంతుడు; సర్వజ్ఞుడు; అనంతమైన జ్ఞానము, ప్రేమా పవిత్రతలు గలవాడు.

దేవుని యొక్క అనంతమైన ప్రేమ నిస్వార్థమైనది. కనుక ఆది నుండి ఆయన తన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవటానికి ఆశపడేవాడు. అందుచేతనే ఆయన జీవరాశిని సృష్టించెను. ఆయన మొదటిగా తన సంతోషాన్ని, మహిమను పంచుకొనుటకు కోట్లాది దేవదూతలను సృష్టించెను. మానవుని సృష్టించుటకు పూర్వమే అది జరిగెను.

దేవదూతలలో ఒకరిని వారికి నాయకునిగ దేవుడు సృష్టించెను. అతడి పేరు లూసిఫర్. ఆ పేరు ఇప్పుడు చెడుగా ఎంచబడుతున్నా, ఒకప్పుడు ఆ పేరు దేవదూతలందరిలో జ్ఞానవంతుడు మరియు ఎంతో సౌందర్యవంతుడైన వానిది. అతడు దేవదూతలందరిలో ప్రధానుడు.

దేవుడు లూసిఫరు గూర్చి ఇట్లు చెప్పెను, "పూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యమును గలవాడవు. అభిషేకము నొందిన కెరూబువు. నీవు నియమింపబడిన దినము మొదలుకొని, పాపము నీయందు కనబడువరకు ప్రవర్తన విషయములో నీవు యదార్థముగా నుంటివి". (యెహెజ్కేలు 28 వ అధ్యాయము 12 నుండి 15 వచనములు).

దేవుడు సృష్టించిన నక్షత్రములు మరియు వృక్షములవలె కాక లూసిఫరు మరియు ఇతర దేవదూతలు దేవునికి లోబడటానికి లేక లోబడకపోవటానికి ఎన్నుకొనే స్వీయ చిత్తము కలిగి యుండిరి.

ఈ స్వీయ చిత్తమనునది ఒక వ్యక్తి నైతికజీవి అగుటకు మొదట అవసరమైనది. నక్షత్రాలు, చెట్లు మంచిగాని, చెడుగాని చేయలేవు ఎందుచేతనంటే తమకు తామే ఏమియు ఎంచుకొనలేవు. అవి దేవుని ఆజ్ఞలకు సంపూర్ణముగా లోబడతాయి. ఎందుచేతనంటే అవి స్వతంత్రముగా నుండుటకు సృష్టింపబడలేదు. అందుచేతనే అవి దేవుని కుమారులుగా కూడ ఉండలేవు. ఒక శాస్త్రవేత్త నిర్మించిన మరమనిషి, అది చేయవలసిన ప్రకారము ప్రతి విషయములో ఎదురు మాట చెప్పక లోబడవచ్చు కొన్ని సార్లు తన స్వంత కుమారుడే సణుగుకొనవచ్చును. కాని ఆ మరమనిషి ఎన్నటికిని అతని కుమారుడు కాలేడు.

రెండవదిగా మనస్సాక్షి యనునది ఒక వ్యక్తి నైతికజీవి అగుటకు ముఖ్య అవసరమైయున్నది. పక్షులు జంతువులు తమ పనులు స్వతంత్రముగా చేసుకొనగలవు. వాటికి మనస్సాక్షి లేదు గనుక అవి నైతిక జీవులు కానేరవు - కనుక అవి పరిశుద్ధముగా గాని, పాపసహితముగా గాని ఉండలేవు.

దేవుడు నైతికజీవి కనుక అవి దేవుని బిడ్డలు కాజాలవు.

నిజానికి పక్షులు మరియు జంతువులు నీ బిడ్డలుగా కూడ కాలేవు.

నీవు ఒక కుక్కకు నీ యొక్క ప్రతి ఆజ్ఞకు లోబడేటట్లు శిక్షణ నివ్వవచ్చు. అయినప్పటికి ఆ కుక్క నీ యొక్క కుమారుడుగ ఎన్నటికిని కాలేదు. ఎట్లనగా నీ కుమారుడు నీ స్వభావం కలిగియుండాలి, నీ కుక్కకు అది యుండదు.

కాని దేవుడు మానవుని తన స్వరూపములో తయారుచేసెను. అదియే మనలను తన బిడ్డలుగా కావటానికి సాధ్యపరచును.

మనము నైతిక జీవులమని గుర్తుచేస్తూ, మనము దేవుని నియమమును మీరినప్పుడు మనలను ఒప్పింప చేసే స్వరమే మనస్సాక్షి.

దేవదూతలు స్వీయచిత్తము, మనస్సాక్షి కలిగి సృష్టింపబడిరి. వారు నైతిక జీవులు. గనుక దేవుని సృష్టి యందు వారు సాటి లేని వారుగా యుండిరి. వారికి నాయకుడైన లూసిఫరు త్వరలోనే మంచివి కానట్టి ఆలోచనలు, ఆశలు గల వాడయ్యెను. లోకములో చెడు అనేది మొట్టమొదటిగా ఇచ్చటనే ప్రారంభమయినది.

లూసిఫరు యొక్క ఆలోచనలు మంచివి కాకపోవుటయే కాదు అవి గర్వముతోను తిరుగుబాటుతోను అసంతృప్తితోను కూడినవి.

అప్పటి వరకు లోకము పరిపూర్ణమైన స్వచ్చతతోనుండెడిది. కాని ఇప్పుడు స్వీయ చిత్తముతో సృష్టింపబడిన ఒక జీవి యొక్క హృదయములో చెడుతనము, అసహ్య రూపమును పైకెత్తెను. జ్ణాపకముంచుకో! చెడు మొట్టమొదట హృదయములోనే ప్రారంభమైనది. మొదట బాహ్యమైన క్రియ లేదు. ఈనాడు కూడ దుష్టత్వము (చెడు) హృదయములోనే ప్రారంభమవుతుంది.

ఈ లోకములోనికి చెడును తీసుకొని వచ్చిన మొదటి పాపము ‘గర్వము’ అనే విషయాన్ని కూడా గుర్తుంచుకో.

దేవుడు లూసిఫరును తన సన్నిధి ఎదుట నుండి వెంటనే త్రోసివేసెను. ఆ క్షణము నుండి లూసిఫరు సాతానుగ పిలువబడెను.

సాతాను పతనమును గూర్చి బైబిలు ఇలా చెబుతుంది,"తేజో నక్షత్రమా! వేకువ చుక్కా! నీవెట్లు ఆకాశము నుండి పడితివి. నేను ఆకాశమున కెక్కిపోయెదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును. మేఘ మండలము మీద కెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును. అని నీవు మనస్సులో అనుకొంటివి గదా? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలను త్రోయబడితివే"(యెషయా 14 అధ్యాయము 12 నుండి 15 వచనములు).

అయితే లూసిఫరు త్రోసివేయబడినప్పుడు కొంతమంది ఇతర దేవదూతలను కూడ, తాను చేసిన తిరుగుబాటులో చేరునట్లు చేసాడు. కోట్లాది దేవదూతలు అతడితో చేరిరి. నిజానికి పరలోకములో గల దేవదూతలలో మూడోవంతు ( ప్రకటన 12 వ అధ్యాయము 4 వ వచనము). కనుక దేవుడు వారిని, లూసిఫరును కూడ బయటికి త్రోసి వేశాడు. ఈ విధంగా పడిపోయిన దేవదూతలే దురాత్మలుగా ( దయ్యాలు) ఈనాడు ప్రజలను ఇబ్బంది పెడుతూ, కష్టాలకు గురిచేస్తూ ఉన్నారు.

బహుశ నీవు దురాత్మల వలన ఇబ్బంది పడి ఉండవచ్చు, లేక ఇతరులు నీపై చిల్లంగి తనము చేసి ఉండవచ్చు, అట్లయితే బైబిలు నందు నీకొక శుభవార్త ఉంది. నీవు సంపూర్తిగా వాటి యొక్క బాధలనుండి శాశ్వతమైన స్వేచ్చను పొందగలవు.

ఈ పుస్తకాన్ని చివరి వరకు జాగ్రత్తగా చదువు. ముగింపునకు వచ్చేసరికి, దేవుడు నీ కొరకు ఎన్ని అద్భుతాలు చేయగలడో నీవు చూడగలవు.

ఇప్పుడు కొంతమంది అడిగే ప్రశ్న ఏమిటంటే లోకంలోనున్న దుష్టత్వానికి (చెడుకు) సాతాను కారణం అయినట్లయితే, దేవుడు ఎందువలన సాతానును, ఇతర దురాత్మలను నాశనం చేయలేదు? అని.

దేవుడు కావాలనుకుంటే తప్పని సరిగా ఒక్క క్షణంలో ఆ పని చేయగలడు. కాని ఆయన అలా చేయడు. ఇది దేవుడు తన అనంత జ్ఞానంతో సాతానును మరియు ఈ దయ్యాలను ఉండనిచ్చుటలో ప్రత్యేకమైన ఉద్దేశ్యం దేవునికి కలదని ఋజువు చేస్తుంది. దానిలో భాగంగానే దేవుడు ఈ భూమిపై మానవ జీవితాన్ని దుర్బరంగాను, భద్రత లేకుండగను, ప్రమాద భరితంగాను చేయుటకు సాతానుని ఉపయోగించుకొని, తద్వారా భూమిపై, మానవుడు కేవలము తను స్వంత సౌఖ్యమునే వెదుకుకొనక, నిత్యత్వము గూర్చి యోచించి దేవునివైపు తిరుగునట్లుగా చేయుచున్నాడు.

ఈ భూమిపై జీవితము రోగము, భాధలు, పేదరికము లేకుండా మిక్కిలి సౌఖ్యవంతముగా ఉండినట్లయితే ఎవరును దేవుని గూర్చి ఆలోచించేవారు కారు. కనుక దేవుడు ఈ లోక జీవితములోని దురవస్థలను, ప్రమాదాలను ఆయన గురించి ఆలోచింపజేసి మన అవసరతలో ఆయన వైపు తిరుగునట్లు ఉపయోగించుకొనును.

సాతాను నీ జీవితములో కల్పించే సమస్యలు, రోగములు మరియు పరీక్షలు నీవు దేవునివైపు తిరగటానికి ప్రేమ గలిగిన దేవుడు అనుమతించినవే. అవన్నీ ఒక విధంగా చెప్పాలంటే నీ యెడల దేవునికి గల ప్రేమను చూపించుటయే.

ఇదే బైబిలు ఇచ్చే సందేశము. దేవునితో ఒకప్పుడు సన్నిహితముగా నుండిన ఒక వ్యాపారవేత్త గురించిన ఒక కథ నేను వినియున్నాను. అతని వ్యాపారము అభివృద్ధి చెందగా, అతడు దేవుని నుండి తొలిగిపోయాడు. ఆయన యొక్క సంఘమందలి పెద్దలు ఆయనను దేవునివైపు త్రిప్పుటకు పదే పదే మాట్లాడారు. కాని అతడు తన వ్యాపారములో బహుగా మునిగిపోయాడు. ఒకరోజు అతని ముగ్గురు కుమారులలో చిన్న వానిని ఒక విషసర్పము కాటు వేయగా, ఆ బిడ్డ మిక్కిలి వ్యాధిగ్రస్తుడయ్యాడు. వైద్యులు కూడ నమ్మకం వదలివేసారు. అప్పుడు వాని తండ్రి మిక్కిలి దుఃఖపడి, ఆ బిడ్డ గురించి ప్రార్థించుటకు సంఘ పెద్దలలో నొకరిని రమ్మని కబురంపాడు. ఆ పెద్ద జ్ఞానము గలవాడు. అతడు వచ్చి ‘ప్రభువా ఈ బిడ్డను కరచులాగున ఆ సర్పమును పంపినందుకు వందనములు, ఎందుచేతనంటే ఈ కుటుంబం నీ గూర్చి ఆలోచించులాగున నేను ఎప్పుడును చేయలేకపోయాను, నేను ఈ ఆరు సంవత్సరాలలో చేయలేని దానిని ఈ సర్పము ఒక్క క్షణంలో చేసింది. ఇప్పుడు వారు వారి పాఠాన్ని నేర్చుకున్నారు. ప్రభూ! ఈ బిడ్డను బాగు చేయండి మరియు నిన్ను జ్ఞాపకము చేసికొనుటకు మరల ఎప్పుడును వేరే సర్పములు వీరికి అవసరం లేకుండ చేయండి’ అని ప్రార్థించాడు.

కొందరు అకస్మాత్తుగా ఒక దినాన్ని కేన్సరుతో గాని వేరొక నయము కాని రోగముతోగాని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళబడే వరకు దేవుని గూర్చి అసలు ఆలోచించరు. అప్పుడు వారు దేవుని గూర్చి ఆలోచించడం మొదలుపెట్టి రక్షణకొఱకు ఆయనవైపు తిరుగుతారు. ప్రజలు వారి పాపముల నుండి మరల్చుటకు నయముకాని జబ్బులు, రోగములు, పేదరికము మరియు లోకమందలి కీడులను దేవుడు వాడుకొనుచున్నాడు. ఆ రీతిగా దేవుడు వారిని పరలోకమందున్న నిత్యత్వపు గృహములు పొందుటకు నడిపించుచున్నాడు. ఆ రీతిగా దేవుడు సాతాను చేసే చెడుపనులను, సాతాను యొక్క కబంద హస్తాల నుండి ప్రజలను నిత్యరక్షణలోనికి నడిపించుటకు వాడుకొనుచున్నాడు.

ఆ రీతిగా దేవుడు సాతానును మరల మరల బుద్దిహీనునిగా చేయుచున్నాడు.

ఇతరుల కొరకు సాతాను త్రవ్విన గోతిలో(తానే) త్రోయబడతాడు.

దేవుడు తన పిల్లలను పుటము వేయుటకుగాను సాతాను నుండనిచ్చుచున్నాడు. అగ్ని యొక్క ఉదాహరణ ఆలోచించండి:

ప్రపంచ చరిత్రలో కోట్లాది ప్రజలు అగ్నిలో కాలిపోవుటచే మరణించారు. అయితే దానిని బట్టి ఎవ్వరును అగ్నిని వాడుట మానివేయలేదు, ఎందువలన? అగ్ని వలననే ఆహారము వండబడుతుంది. మోటారు వాహనాలు, విమానాలు మరియు యంత్రాలు నడుస్తున్నాయి. బంగారము కూడ అగ్ని ద్వారానే స్వచ్చమవుతుంది. కనుక అగ్ని ప్రమాదకరమైనదైనా, హానికరమైనదైనా, మంచి పనులకు ఉపయోగించవచ్చు.

అదే రీతిని సాతాను చెడ్డవాడయినప్పటికి, ప్రజలను తప్పుత్రోవను పట్టించే వాడయినప్పటికి దేవుడు వానిని వాడుకొనిచున్నాడు. దేవుని బిడ్డలను వేర్వేరు అగ్నివంటి శ్రమలు మరియు శోధనలు ద్వారా పరీక్షించుటకు సాతానుకు అనుమతి ఇవ్వబడినది; ఆ విధముగా వారు బంగారము అగ్నిగుండా వెళ్ళినట్లు పవిత్రముగా మరియు స్వచ్చముగా తయారు కాగలరు.

కనుక దేవుడు లోకములోనున్న చెడునంతటిని ఒక్క క్షణములో తీసివేయగలిగినా, ఆయన అట్లు చేయడు. ఎందుచేతనంటే ఆయన యొక్క మహిమకరమైన సంకల్పము వాటి ద్వారా నెరవేర్చుకొనుటను మనము చూడగలము.

2. పాపమును గూర్చిన యదార్ధ సత్యము
కొందరు ఎందుకు తరచుగా జంతువులవలె ప్రవర్తిస్తారు?

దానికి సమాధానము వారు శారీరక అవసరాలు మరియు భూమి మీద ఉనికిని గూర్చియే ఆసక్తి గలిగి యుండుట వలననే.

ఒక జంతువు దేని మీద ఆసక్తి గలిగియుంటుంది? ఆహారము, నిద్ర మరియు లైంగిక సంతృప్తి. అంతే గదా! ఒక మనిషి ఎప్పుడైతే ఈ విషయముల గూర్చి మాత్రమే ఆసక్తి గలిగియున్నాడో, అతడు జంతువులతో సమానమైన స్థితికి దిగజారియున్నాడని మనము చెప్పవచ్చు.

కాని దేవుడు మానవులను జంతువులవలె చేయలేదు. ఆయన మనలను తన పోలికలో చేసి నీతి, యదార్థతలు, గుణశీలములు, ఆశా నిగ్రహము కలిగి పశు వాంఛలకు బానిసకాకుండా చేసెను.

మనము జంతువుల కంటె తెలివి గలవారము మరియు విద్య గలవారము అనే సత్యము మనలను వాటికంటె శ్రేష్ఠులుగా చేయదు? ఎందుకంటె ఎంతో తెలివితేటలు, విద్యగలవారు సహితము లోభము, స్వార్థము, కామేచ్చలు, కోపము మొదలగు వానికి బానిసలై యున్నారు.

మన మనస్సు కంటె లోతైన భాగమొకటి మనలో నున్నది! అది మనకు దేవుని నెఱుగునట్లు చేయు మన యొక్క ఆత్మ. ఏ జంతువులకు అట్టి ఆత్మలేదు.

మనము ఇది వరకు చూచినట్లు, దేవుడు మనలను కావాలనుకొన్నది స్వేచ్చగా ఎంచుకొనే అధికారము కలిగిన నైతిక స్వేచ్చా జీవులుగా చేసెను. కాని ఎంచుకొనే స్వేచ్చకలిగియుండుటలో ప్రమాదమేమిటంటే ఆ స్వేచ్చమనలను మనము సంతోష పెట్టుకొని, దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపునట్లుగా చేస్తుంది. కాని దేవుడు అటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనడానికి యిష్టపడుతున్నాడు. ఎందువలనంటే ఎవరైతే ఇష్టపూర్వకముగా ఆయనను ఎంచుకుంటారో, అటువంటి బిడ్డలను ఆయన కోరుకొనుచున్నాడు.

ప్రపంచమందలి గందరగోళమునకు, కలవరపాటుకు రోగములకు మరియు కీడులకు గల సూటియైన కారణము మానవుడు దేవునికి అవిధేయుడై, సాతాను యొక్క మాట వినుటయే.

దేవుడు సృష్టించిన మొదటి పురుషుడు, స్త్రీ- ఆదాము మరియు హవ్వగా పిలువబడిరి. వారు సృష్టింపబడినప్పుడు పాపరహితులుగా నుండిరి. కాని వారు పరిశుద్దులగుటకు ఒక ఎంపిక చేసికొనవలసి వచ్చింది. ఆ విధముగా ఎంపిక చేసికొనుట కొఱకు వారు శోధింపబడాలి. ఈ విధంగా వారు చెడును తిరస్కరించి, దానికి బదులుగా దేవునిని ఎంచుకొనగలిగియుండిరి. అందువలన సాతాను వారి యొద్దకు వచ్చి శోధించులాగున, దేవుడు అనుమతించాడు.

మనము దీనిని బైబిలునందలి మొదటి పుస్తకమైన,ఆదికాండము 2, 3 అధ్యాయములలో చదువగలము.

అమాయకత్వానికి, పరిశుద్దతకు చాలా తేడా ఉంది. అమాయకత్వం అనేది పసిబిడ్డలో చూస్తాం. ఆదాము సృష్టింపబడినపుడు ఎలా ఉండేవాడో తెలిసికోవాలంటే, అమాయకత్వం, మంచి చెడుల నెరుగని ఒక పసిబిడ్డను చూడు. కాని ఆ చిన్న బిడ్డలో పరిశుద్దతగాని, పరిపూర్ణతగాని లేవు. అయితే పరిపూర్ణత నొందుటకుగాను, ఆ పసిబిడ్డ ఎదగాలి, చెడును తిరస్కరించి, దేవుని ఎంచుకొనేలా కొన్ని ఎంపికలు చేసుకోవాలి.

మన మనసులలో ఎప్పుడైతే శోధనకు లోబడుటకు తిరస్కరిస్తామో మన నడవడి వృద్ది పొందుతుంది. ఇప్పుడు నీ వేమయి యుంటివో ఆ స్థితి, యింత వరకు నీ జీవితంలో నీవు ఎన్నుకొనిన ఎంపికలను బట్టి నీకు కలిగినది.

నీ చుట్టునున్న ఇతరులు నీ కంటె బాగుగా ఉన్నట్లయితే, వారు వారి జీవితములలో నీ కంటె మంచి విషయములు ఎన్నుకొని యుంటారు. మనము ప్రతిరోజు కొన్నిటిని ఎంచుకొంటాము ఆ ఎంపికలే మనం చివరికి ఏమవుతామో నిర్ణయిస్తాయి.

దేవుడు మొదట స్త్రీ, పురుషులను చేసినప్పుడు సాతాను వలన శోధింపబడుట ద్వారా, వారు పరిశుద్దులయే అవకాశాన్ని దేవుడు వారికిచ్చాడు.

వారిని ఒక తోటలో ఉంచి, ఒక చెట్టువి తప్ప ఆ తోటలో నుండిన ప్రతి చెట్టు పండ్లను తినవచ్చునని చెప్పాడు. అది ఒక పరీక్ష.

నిజానికి అది చాల సుళువైన పరీక్ష- ఎందుచేతనంటే వారు వేలకొద్ది ఆకర్షనీయమైన చెట్లకుండిన తియ్యని ఫలములుండిన తోటలోనికి పంపబడ్డారు మరియు ఒక చెట్టు పండు తప్ప వాటిలో దేనినైనా తినవచ్చని చెప్పడం జరిగింది. కాని వారు విధేయత గూర్చిన చిన్న పరీక్షలో ఓడిపోయారు.

ఎందుకంటె సాతాను తోటలో నున్న వారి దగ్గరకు వచ్చి మీరు తినకూడని వృక్షఫలములు తినినట్లయితే, మీరు దేవునివలె ఉందురని చెప్పుట ద్వారా ఆదాము, హవ్వలను శోధించెను. ఆ సమయంలో ఆదాము హవ్వలు ఎదుర్కొనిన శోధన, కేవలం చెట్టుపండు తినటం అనే సామాన్య విషయం కాదు గాని, వారు కోరుకుంటే దేవునివలె అవ్వటం అనునదే. అదే సాతాను ఒకప్పుడు తన విషయంలో కూడా కోరుకునెను మరియు అదే ఆదాము హవ్వలకు కూడ చెప్పెను. కాని సాతాను ఈ దినాన్న ఎలాంటి అబద్దములతో ప్రజలను మోసగిస్తున్నాడో అలాగే అది కూడా ఒక అబద్దమయి ఉన్నది. ఈనాడు సైతాను యొక్క అబద్దములకు ఏ విధముగా ప్రజలు పడిపోతారో అలాగే ఆదాము హవ్వలు అప్ప్పుడు పడిపోయారు. వారు దేవునికి అవిధేయత చూపి, అంతకు ముందు సాతాను పొందిన గతినే అనుభవించారు. వారు దేవుని సన్నిది నుండి త్రోసి వేయబడ్డారు.

దీనికి సంబంధించిన వివరాలన్నియు బైబిలు గ్రంధమందలి మొదటి పుస్తకంలో చదువవచ్చు( ఆదికాండం 3వ అధ్యాయము).

ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞ మీరుట ద్వారా వారు దేవునివలె సర్వశక్తిమంతులుగాను, స్వతంత్రులుగా నుందుమని అనుకొనిరి. కాని వారు స్వతంత్రులయ్యారా? లేదు. వారు కేవలం సాతానుకు భానిసలయ్యారు. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించుట ద్వారా మాత్రమే మనము నిజముగా స్వతంత్రులము కాగలము.

ఈ విషయములోనే సాతాను అనేకులను మోసగిస్తాడు. వారు నిజంగా జీవితాన్ని అనుభవించాలంటే, వారు దేవుని యొక్క ఆజ్ఞలను అలక్ష్యము చేయమని సాతాను వారికి ప్రబోధిస్తాడు.

ఇప్పుడు మనం మానవజాతిలో పాపము ఎలాగు మొట్టమొదట ప్రారంభమైనదో చూచితిమి.

ఆదాము హవ్వలు ఏదేను తోటలో ఆ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసికొన్నారు. అది వారికి వారి పిల్లలకు జీవితకాల పర్యంతముండే పర్యవసానాలను ఉత్పత్తి చేసింది.

మన జీవితములో మనము తీసుకొనే నిర్ణయాలన్నీ వాటి పర్యవసానాలను తెస్తాయి. మనమందరము మనము ఏదైతే విత్తామో అది కోయవలసియున్నది. అనేక సార్లు, మన పిల్లలు సహితము మనము విత్తిన దాని చేదైన ఫలములను కోయవలసి యుంటుంది.

ఆదాము విషయములో, అతడు, అతని భార్య వారి మిగిలిన జీవిత కాలమంతయు దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడిరి.

కాబట్టి ఈనాడు మనము చేసికొనిన చిన్న ఎంపికలు అంత ప్రాముఖ్యమైనవి కావని, లేక ఈనాడు మనము విత్తిన దానికి భవిష్యత్తులో ఎప్పుడును కోయనక్కరలేదని తలంచరాదు.

మనము భూమి మీద దేనికంటెను ఎక్కువగా దేవునిని నిజముగా కోరుకొనుచున్నామని ఆయనకు ఋజువు చేసికొనులాగున, మనము వివిధ వ్యక్తుల ద్వారాను, వివిధ పరిస్థితులు ద్వారాను పరీక్షింపబడుటకు మరియు శోధింపబడుటకు దేవుడు అనుమతిస్తాడు.

మనము వెళ్ళుచున్న ప్రతి శోధన యొక్క ఉద్దేశము మనము సృషింపబడిన వాటన్నిటి కంటె సృష్టికర్తకు ఎక్కువ విలువ ఇస్తున్నామా లేదా అనునది పరీక్షింపబడుటకై ఉన్నది.

అన్ని పాపముల యొక్క సారాంశమేమనగా సృష్టింపబడిన వాటికి మరియు మనలను దేవునికంటె ఎక్కువగా ఎంచుకోవటమే. అది దేవుని మార్గాన్ని ఎంచుకోవడానికి బదులు మన స్వంత మార్గాన్ని ఎంచుకొనడము. దేవుని సంతోష పెట్టుటకు బదులు మనలను మనమే సంతోష పెట్టుకొనడము.

పాపము అంటే కేవలం వ్యభిచరించటం లేక హత్య చేయటం లేక దొంగిలించటం కాదు. అది మన స్వంత మార్గాన్ని కోరుకోవటం. చంటి బిడ్డ యొక్క మొండితనములోనే మనము పాపము యొక్క ప్రారంభన్ని చూడగలము. పుట్టినప్పటి నుండి ప్రతి బిడ్డ నైజములో పాపముంటుంది మరియు అతడు ఎదుగుతున్న కొలది, తాను కావాలనుకొన్నది చేయటానికి నిర్ణయించుకోవటం, తాను కోరినది పొందుటకు ఇతర పిల్లల దగ్గర లాగుకొనుట, తగువులాడుట చేస్తూ ఉంటాడు.

మనము పెద్దవారముగ ఎదిగినప్పటికి, మనము చిన్నవారముగ నుండినప్పుడు ఎలావుంటిమో అంతకంటె ఎక్కువగా మార్పుచెందము. మనము తెలివిగలవారమై మన పద్దతులు మార్చుకొందుము. చివరకు సంస్కారం కలవారు కూడ అదే విధంగా వుండిపోతారు. వారు వారి యొక్క స్వార్దాన్ని, దురాశలను, శరీరాశలను, బాహ్య సంబంధమైన మర్యాదతోనో లేక మతమనే ముసుగుతోనో కప్పుకొందురు!!

పాపము మన యొక్క ప్రతి అణువులోనికి చొచ్చుకొని పోయినది. పాపమును మతసంబంధ అభ్యాసములైన ఉపవాసము, ప్రార్థన లేక తీర్థయాత్రలు లేక ఆశానిగ్రహము ద్వారా వదిలించుకొనలేము. దేవుడు మాత్రమే పాపము నుండి మనలను రక్షించగలడు.

కాని పాపము ఎంత చెడును కలిగిస్తుందో మనము తెలిసికొను వరకు దేవుడు కనిపెట్టుచుండును. తాను పాపులనే పిలువ వచ్చితిని గాని, నీతిమంతులను పిలువరాలేదని ఒకసారి యేసు ప్రభువు చెప్పారు. దీని అర్థము భూమిపై కొందరు నీతిమంతులనియు, మరికొందరు పాపులనియు కాదు. తమకుతామే పరిశుద్దులమనుకొనే స్వనీతిపరులైన మత తత్త్వపు ప్రజలనుద్దేశించి, ఆయన ఎత్తిపొడువుగా, ఆ మాటలు చెప్పారు. ఎవరైతే తమకుతామే నీతిమంతులుగా చూచుకొంటారో వారిని రక్షించలేనని యేసు యొక్క భావము.

ఎవరైతే తాము అనారోగ్యముగా నున్నట్లు గుర్తింతురో వారు వైద్యుని దగ్గరకు వెళ్ళుదురు. అలాగే మన మొదటి అవసరత మనము పాపులమని గుర్తించడము.

మన మతము ఏదైనప్పటికి, మనమందరము పాపులము. మనమందరము ఆలోచనలలోను, మాటలలోను, పనులలోను, వైఖరిలోను, ఉద్దేశములలోను దేవుని పరిశుద్ద శాసనములకు వ్యతిరేకముగా పాపము చేసినవారము. మనము దేవుని యొక్క పరిశుద్ధ ప్రమాణాలకు తక్కువగా నున్నాము.

రోగము మన శరీరాలను నష్టపరచిన దానికంటె, పాపము మన ఆత్మకు ఎక్కువ నష్టం కలుగజేయును. అయితే ఈ విషయాన్ని మనం గుర్తించుచున్నామా?

ఈ రోజుల్లో ప్రపంచమంతట వ్యాపించుచున్న లైంగిక సంపర్కము వలన వ్యాపించే భయంకరమైన వ్యాధి - ఎయిడ్స్ పై నీ ప్రతిస్పందన ఏమిటి?

ఎయిడ్స్ ఎంతటి అంటు వ్యాధి అంటే ఆ వ్యాధి గల వాని దగ్గరకు ఏ మాత్రమైనను వెళ్ళటానికి ప్రజలు భయపడుదురు. పాపము నిజానికి అంతకంటె భయంకరమైనది ఒకే ఒక తేడా ఏమనగా పాపము మన ఆత్మకు నష్టం కలిగిస్తుంది. కనుక అది బయటకు కనబడదు. ఎయిడ్స్ వ్యాధి ఫలితాలు కంటె, పాపము యొక్క ఫలితాలు బహు ఘోరమైనవి. మనము దాని నుండి రక్షింపబడకపోయినట్లయితే అది మన జీవితాలను పాడుచేస్తుంది, మనలను ఈ లోకంలో సంతోషం లేని వారుగ చేస్తుంది, చివరకు నిత్యత్వంలో కూడా నాశనం చేస్తుంది.

3. మన మనస్సాక్షి గురించిన యదార్ధ సత్యము
మనము నైతిక జీవులమని నిరంతరము మనకు జ్ఞాపకం చేసే మనస్సాక్షితో మనము సృష్టింపబడ్డాము. మనం చేసే ప్రతిపనికి మనమే బాధ్యులమని, మన అంతరంగములో నుండి మనకు వినిపించు స్వరమే మనస్సాక్షి. ఒకరోజున, మనం జీవించిన జీవితాన్ని గూర్చి మనం దేవునికి లెక్క అప్పజెప్పవలసియుంది.

మనము మనస్సాక్షి లేనటువంటి జంతువులవలె లేము. జంతువులు నైతిక జీవులు కాదు గనుక అవి దేని విషయములోను దేవునికి జవాబుదారులై యుండుట లేదు.

ఒక జంతువు ఎప్పుడైతే చనిపోతుందో, దాని ముగింపు అంతటితో అయిపోతుంది, గాని మన విషయములో అలాగున కాదు. మానవుడు దేవుని స్వరూపములో సృష్టింపబడినవాడు మరియు నిత్యుడు.

మనకు తీర్పు దిన మొకటి గలదు. అప్పుడు మన జీవితకాలమంతటిలో మనము చేసిన క్రియలు, మన మాటలు, తలంపులు మన జ్ఞాపకములోనికి తేబడి దేవునిచే పరిశీలింపబడును. ఆయన బైబిలులో యివ్వబడిన పరిశుద్ద శాసనముల ప్రకారముగా ఆయన మనకు తీర్పు తీర్చును. అప్పుడు మనము చేసిన ప్రతి ఒక్క పనికి, మాటకు, తలంపుకు ఆ సమయములో దేవునికి జవాబు చెప్పుకొనవలసి యుంటుంది.

‘మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును’ (హెబ్రీయులు 9 వ అధ్యాయము 27 వ వచనము) అని బైబిలు చెబుతుంది.

అనేకులు వారు చేసిన నేరాలకు తగిన శిక్షను పొందకుండ ఈ భూమిపై తప్పించుకొందురు. కాని వారు చివరిగా దేవుని న్యాయపీఠము యెదుట నిలిచినప్పుడు, వారికి తగినట్టి న్యాయమైన శిక్షను పొందుతారు. అట్లే అనేకులు యితరుల యెడల చేసిన మంచికి ఈ భూమి మీద అభినందింపబడలేదు లేక ప్రతిఫలము పొందలేదు, కాని వారు క్రీస్తు తిరిగి భూమి మీదికి వచ్చినప్పుడు ప్రతిఫలము పొందుతారు.

మనము చేసిన దాని కంతటికి ఒక దినమున దేవునికి జవాబు చెప్పుకోవలసియున్నది, గనుక మన మనస్సాక్షి యెక్క స్వరాన్ని మనమెల్లప్పుడు వినుటకు ప్రాముఖ్యత నివ్వవలసియున్నది.

దేవుడు మానవునికిచ్చిన గొప్ప వరములలో మనస్సాక్షి ఒకటి. అది మన శరీరానికి ఇవ్వబడిన నొప్పి అనే వరము వంటిది మనలో అనేకులు ఈ నొప్పిని ఒక చిరాకు కలిగించుదానిగ తలుస్తారు. కాని నొప్పి అనేది మన జీవితాలకు ఎంతో గొప్ప దీవెన అనేది మనము గమనించము. నొప్పి ద్వారానే శరీరములో ఎక్కడనో, ఏదో సరిగా లేదని శరీరము మనకు హెచ్చరిక చేస్తుంది. అది రోగమును గూర్చి హెచ్చరించే, శరీరము యొక్క మొదటి సంకేతము. అది నొప్పిద్వారా కాకపోయినట్లయితే, ఎప్పుడు మనము వ్యాధిగ్రస్తులమో మనకు తెలియదు మరియు మనము మరణించ వచ్చు కూడా. ఆ నొప్పియే మనము అకాల మరణము నొందకుండా రక్షిస్తుంది.

కుష్ఠురోగులు నొప్పిని కలిగియుండరు, ఎందుచేతనంటే కుష్ఠురోగము నరములను చంపివేస్తుంది మరియు స్పర్శజ్ఞానమును నశింపజేస్తుంది. ఒక కుష్ఠురోగి తన పాదము గుండా ఒకమేకు దిగిపోయినను, బాధ తెలియకుండా ఉంటాడు. ఆ పాదమునకు రోగము కలిగినప్పటికి, దాని నెఱుగడు. చివరకు అతని యొక్క పాదము తీసివేయవలసినంతగా చెడిపోతుంది. దీనికి కారణం అతనికి ‘నొప్పి అనే దీవెన’ లేకపోవుటయే.

మనస్సాక్షి నొప్పివంటిది. మనము దేవుని శాసనాలను మీరుచున్నప్పుడు, మనము పాపము చేయుట గురించి ఆలోచించుచున్నప్పుడు, లేక మనమప్పటికే పాపము చేసినప్పుడు, అది మనలను హెచ్చరిస్తుంది. మనము దాని హెచ్చరికలను లక్ష్యపెట్టక, దానికి వ్యతిరేకముగా వెళ్ళినట్లయితే, క్రమక్రమముగా మనలో పాపము గూర్చిన భావమును మనము చంపివేస్తాము. అప్పుడు పాపమును గూర్చి ఏ మాత్రమైనను స్పర్శలేని దినమోకటి మనకు వస్తుంది. అప్పుడు మనము మృతమైన మనస్సాక్షి గల ఆత్మీయ కుష్ఠురోగులమవుతాము . మనస్సాక్షి లేనటువంటి జంతువులవలె నుందుము. అందువల్లనే కొందరు జంతువులకంటె అద్వాన్నముగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి జీవితానికి చిట్టచివరి ఫలితము దేవునిచే శాశ్వతముగా శిక్షింపబడటమే.

మనము పాపులమని మనకందరికి తెలుసు, ఎందుచేతనంటె మన మనస్సాక్షి ఆ విషయం చెబుతుంది. మనము ఆ దోషము గూర్చిన భావనను ఎప్పుడు వదలుకోకూడదు. ఎందుచేతనంటె ఆ దోషము గూర్చిన భావము ‘నొప్పి అనే దీవెన’ వంటిది. మనము, ఆత్మ సంబంధమైన రోగగ్రస్థులముగా నున్నామని, మనకు స్వస్థత అవసరమని అది చెబుతుంది. దేవుడు మానవునికిచ్చిన అత్యుత్తమ వరము మనస్సాక్షి.

యేసు మనస్సాక్షిని కన్నుతొ పోల్చెను (లూకా సువార్త 11 వ అధ్యాయము 34 నుండి 36 వచనాలు).

మన కండ్లు మన శరీరమంతటిలో పరిశుభ్రమైన భాగములు, ఎందుకంటే అవి మన కన్నీళ్ళచే ప్రతిరోజు అనేకమార్లు కడుగబడతాయి.

మన కనురెప్ప వేసి తీసిన ప్రతిసారి (మనకు తెలియకుండా వేలకొలదిసార్లు ఒక దినములో అది జరిగిపోతూ ఉంటుంది) వానిలో పడిన దూళి నుండి కండ్లు కడుగబడతాయి. మన కన్నులు శుభ్రముగా కడుగుకొనే వరకు కండ్లను చికాకు పెట్టుటకు, మనము పనిచేయకుండా ఆపుటకు చిన్న ధూళిరేణువు సరిపోతుంది.

అదే విధంగా మన మనస్సాక్షిని ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకోవాలి.

మన పాపములు దేవుని వలన మాత్రమే క్షమింపబడగలవు మరియు కడుగబడగలవు. మన మనస్సాక్షి దోషమును గూర్చిన భావము నుండి విడిపించబడటానికి అదొక్కటే మార్గము.

కాని పాపములకు క్షమాపన చౌకైనది కాదు.

4. పాప క్షమాపణను గూర్చిన యదార్ధ సత్యము
ఏలాగున దేవుడు మన పాపములను క్షమిస్తాడు?

దేవుడు న్యాయవంతుడైన మరియు నీతిమంతుడైన దేవుడు కనుక ఒక వ్యక్తి యొక్క పాపములను ఉపేక్షించి క్షమించలేడు అది అన్యాయమౌతుంది.

దేవుడు పరిశుద్ధుడు మరియు న్యాయవంతుడునైన దేవుడు, అందుచేత ఆయన పాపానికి శిక్ష విధించాలి.

అయితే ఆయన ప్రేమకలిగిన దేవుడు కూడ అగుటచే మన పాపములు క్షమించబడుటకు ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసాడు.

అన్ని మతములు మంచిగా ఉండవలెనని, దయగలిగి యుండవలెనని మరియు సత్యముగా నుండవలెనని మనకు బోదిస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నియు మనము మన పాపములకు క్షమాపణ పొందిన తరువాత ఎలా జీవించాలనే విషయాన్ని తెలుపుతున్నాయి.

మంచితనము, దయార్ద్ర హృదయము మరియు యదార్ధత గలిగియుండుట అనునవి ఒక భవనము యొక్క పై కట్టడము వంటివి. పాపక్షమాపణ యనునది ఆ భవనము యొక్క పునాది వంటిది.

ఒక భవనము యొక్క ముఖ్యమైన భాగము దాని పునాదియే. మనపాపములను క్షమించుటకు దేవుడు, లోకమును సృష్టించినప్పటి కంటె అధికమైన కష్టము, బాధ కలిగించునదొకటి చేయవలసి యుండెను.

ఏలయనగా లోకమును సృష్టించుటకు దేవుడు ఒక మాట మాత్రమే పలికినప్పుడు వెంటనే లోకము ఉనికిలోనికి వచ్చింది. కాని కేవలము మాట మాత్రము పలుకుట ద్వారా ఆయన మన పాపమును క్షమించలేడు. మానవుని యొక్క పాపములు క్షమించబడుటకు ఒకే ఒక మార్గము కలదు.

దేవుడు మనవంటి యొక మానవుడు కావలసియుండెను. మానవ మాత్రులముగా మనము ఎదుర్కొనుచున్న శోధనలు మరియు పోరాటముల ద్వారా ఆయన జీవించవలసి యుండెను మరియు మన పాపములకు శిక్ష ఆయనపై వేసుకొని మనకు బదులుగా ఆయన బలి యాగముగా చనిపోవలసి యుండెను.

పాపమునకు శిక్ష అనేది బాధ లేక అనారోగ్యము లేక పేదరికము లేక సమాజములో అట్టడుగు స్థితిలో తిరిగి జన్మించుట లేక అటువంటిది మరొకటి కాదు. అది ఎల్లకాలము దేవుని నుండి వేరు చేయబడుటకు సమానమైన నిత్య (శాశ్వత) మరణము.

భౌతిక మరణము అనగా మన భూ సంభందమైన శరీరము నుండి వేరు పర్చబడుట. అటులనే సమస్త జీవమునకు మూలాధారమైన దేవుని నుండి వేరుచేయబడుటయే ఆత్మీయ మరణమైయున్నది.

నీవు భవిష్యత్తులో చేయబోవు మంచి పనులు గతములో నీవు చేసిన దుష్టత్వానికి ఎన్నటికిని ప్రాయశ్చిత్తము కానేరవు. పాపము అనేది దేవుని శాసనములకు మనము తీర్చవలసిన బాకి (అప్పు). మనము దేశము యొక్క చట్టములకు అవిధేయత చూపితే, ఉదాహరణకు, మనము కట్టవలసిన పన్నులు కట్టకుండా మోసము చేసి, తరువాత కట్టగలనని చెప్పినంత మాత్రముచేత మనము క్షమించబడము. అంతేకాదు, భవిష్యత్తులో మనము పన్నులు కడుతున్నా, గతములో బాకీ ఉండిన పన్ను అంతయు కట్టవలసియుంది. పాపము విషయములోను అంతే.

భవిష్యత్తులో మనమెన్ని మంచి కార్యాలు చేయువారమైనప్పటికి గతములో మనము చేసిన పాపములకు మూల్యము చెల్లించవలసి ఉంది.

‘మా నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డవలె నాయెను’ అని బైబిలు చెబుతుంది (యెషయా 64 వ అధ్యాయము 6 వ వచనము).

దేవుడు మంచి పనులను మెచ్చుకొంటాడు. కాని మనము చేసిన శ్రేష్ఠమైన పనులు కూడ దేవుని యొక్క పరిశుద్ధ ప్రమాణాలకు సాటిరావు. ఎందుకంటే ఆయన అనంతమైన పరిశుద్ధుడు కనుక మనము ఏమాత్రమును నిరీక్షణ లేక తప్పిపోయిన వారము, మన మంచి కార్యము ఎంత మాత్రమును సరిపడవు గనుక దేవుని సన్నిధికి నెప్పటికైనను చేరుటకు మనమిక నిరీక్షణ లేనివారముగా యున్నాము. మనము నిరీక్షణలేని విధముగా తప్పిపోయిన వారము.

కాని దేవుడు ఆయన యొక్క గొప్ప ప్రేమచేత మన పాపములు క్షమించబడుటకు ఒక మార్గమును ఏర్పాటు చేసాడు.

దేవుడు చాలా క్లిష్టమైనవాడు గనుక మన మానవ మేధస్సులు ఆయన సమ్మిళిత స్వభావాన్ని గ్రహించలేవు. బైబిలు దేవునిని ఒకనిగా బయలు పరుస్తున్నా, ఆ ఏకత్వములో ముగ్గురు వ్యక్తులు - తండ్రి, కుమారుడు (దీని యర్ధము తండ్రికి కలిగిన స్వభావమే, ఆయన కలిగియున్నాడు తప్ప తండ్రి ద్వారా పుట్టినవాడు కాదు) మరియు పరిశుద్ధాత్మ - వీరందరు ఒకరితో నొకరు సమానమైన వారు.

మన మానవ మేధస్సుకు ఆ ముగ్గురు వేర్వెరు వ్యక్తులు ఏ విధంగా ఒకే దేవుడుగా ఉన్నారనే విషయం గ్రహింపశక్యము కాదు. వేర్వేరు శరీరాలు గలిగిన వ్యక్తులు గురించి మాత్రమే మనము ఆలోచించగలము. కాని దేవుడు ఆత్మయై యున్నాడు. మన మేధస్సులు పరిమితమైనవి. అవి దేవుని యొక్క అసాధారణ నైజమును గ్రహింపలేవు.

మానవులు అర్ధము చేసుకోగలిగిన విషయములను ఒక ‘కుక్క’ ఏలాగు అర్దము చేసుకొన లేదో అట్టి రీతిని నరమాత్రులమైన మనము దేవుని గూర్చిన కొన్ని విషయములను అర్ధము చేసుకొనలేము.

దేవుడు దేనినైతే బైబిలు నందు మనకు బయలుపరచుటకు ఎర్పాటు చేసాడో వానిని మాత్రమే మనము తెలిసికొనగలము. అంతకు మించి తెలియవు.

ఉదాహరణకు, నీవు ఒక తెలివైన కుక్కకు 1+1+1 = 3 అనే కూడికను మూడు ఎముకలను దాని ముందు ఉంచి, వానిని ఒకదాని తరువాత మరొకటి లెక్కించి దానికి విశదపరచుటకు ప్రయత్నించగలవు. కాని 1x1x1=1 అనే గుణకారమును అదే కుక్కకు నేర్పించుటకు ప్రయత్నించు. అతి తెలివైన కుక్క కూడా దానిని అర్ధము చేసుకొనలేదని గ్రహిస్తావు.

మానవ మాత్రులమైన మనకు ‘ఒకట్లు’ మూడు అయినప్పటికి ఒకదానితో నొకటి గుణించినప్పుడు ఒకటి యగునని బాగుగా తెలియును.

మన మేలాగు కుక్కల కంటె ఉన్నతమైన వారమో, ఆలాగే దేవుడు మనకంటె ఎంతో అత్యున్నతమైనవాడు.

గుణకారమును అర్ధము చేసికొనుటకు కుక్క మానవుడుగా నుండవలెను. మనము దేవుని అర్ధము చేసికొనడానికి మనము దేవునివలె నుండవలెను

కనుక దేవుడు ముగ్గురు వ్యక్తులయినప్పటికి ఒకే దేవుడు అను విషయము మనము అర్ధము చేసుకొనలేకపోవుట ఆశ్చర్యము కాదు.

మనము అర్ధము చేసుకొనలేక పోయినప్పటికి అది సత్యమని మనకు తెలుసును, ఎందుకనగా దేవుడు తన వాక్యములో ఆ రీతిగ చెప్పెను.

ఇదే విధముగా అనేకులు మానవ తర్కాన్ని ఉపయోగించి - దేవుడు సర్వాంతర్యామి అయినట్లయితే ప్రతి మానవునిలోను, ప్రతి జంతువులోను, ప్రతి మొక్కలోను మరియు ప్రతి మతపరమైన ఆరాధనా స్థలములోను ఉండి తీరాలని చెబుతారు. ఇది దైనికమైన సత్యములను అర్ధము చేసుకొనలేనటువంటి సంకుచితమైన మానవ మేథస్సుకు ఇది సరిగానే అనిపిస్తుంది.

కాని ఇది పూర్తిగ తప్పు. దేవుడు సర్వాంతర్యామి అనగా - ఆయనకు ప్రతిచోట జరిగే ప్రతి విషయం తెలియునని అర్ధం. అలాగే ఆయన నరకములో లేడు అయినప్పటికి అక్కడ జరుగుతున్న దేమిటో ఆయనకు తెలియును.

నరకము అనే దానికి అసలైన అర్ధము (నరకము అనగా పాపులకు నిత్యశిక్ష) ‘దేవుడు లేని చోటు’. అదియే పాపుల యొక్క వేదనను నరకములో భరించలేనట్లు చేస్తుంది.

కనుక ఖచ్చితముగా దేవుడు ప్రతివారిలో నివసించడు.

మానవజాతిని వారి పాపములకు రావలసిన నిత్యశిక్ష నుండి రక్షించుటకు, 2000 సం. క్రిందట తండ్రియైన దేవుడు కుమారుని పరిశుద్ధాత్ముని అద్బుత క్రియ ద్వారా ఒక కన్యకు బిడ్డగా పుట్టునట్లు పంపించెను. ఆయనకు యేసుక్రీస్తు అను పేరు పెట్టబడెను.

ఆయన బాల్యము నుండి మానవులు ఎదుర్కొనే ప్రతిశోధనను ఎదుర్కొనుచూ పెద్దవాడయ్యెను. ఆ శోధనలన్నిటి యందును ఆయన జయమును పొందెను. ఆయన ఎన్నడునూ పాపము చేయలేదు.

తండ్రియైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును తన 33 వ ఏట దుష్టులైన ప్రజలు పట్టుకొని, సిలువ వేయబడుటకుగాను అనుమతించెను. ఆయన మానవజాతి పాపములను తానుతీసికొని సిలువపై మన కొరకు శాపమాయెను మరియు మానవజాతి పాపములకు శిక్షను అనుభవించెను - అచ్చట మనము దేవుని యొక్క అద్బుతమైన ప్రేమను చూడగలము.

యేసుక్రీస్తు సిలువపై మరణించి ఆయన రక్తము చిందించినప్పుడు, మన పాపముల కొఱకు చెల్లించవలసిన నీతియుక్తమైన పరిహారము పూర్తిగా చెల్లింపబడెను, న్యాయపు తీర్పు పూర్తిగా తీర్చబడెను.

యేసుక్రీస్తు సిలువపై అర్పించిన బలియాగము అంగీకరింపబడెనని ఈ లోకమునకు ఋజువు చెయుటకుగాను, ఆయన పాతిపెట్టబడిన తరువాత మూడు దినములకు దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను.

దేవుడు ఒక్కడే యనియు ఈ భూమిపైకి మానవ రూపములో వచ్చిన ఒకే ఒక దైవ అవతారము యేసుక్రీస్తే అనియు రెండు వాస్తవాల ద్వారా ఋజువగుచున్నది.

1) ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే లోక పాపముల కొఱకు చనిపోయినవాడు.

2) ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే మృతినొందిన తరువాత మరల ఎన్నడును మరణించకుండా మానవుని యొక్క బద్దశత్రువైన మరణమును జయించి, సజీవుడై తిరిగి వచ్చెను.

( నలుబది దినములు భూమిపై నున్న తరువాత, యేసు పరలోకమునకు వెళ్లి, ఇప్పుడు అక్కడనే ఉన్నారు).

నలుబది దినములు భూమిపై సంచరించిన తరువాత యిప్పుడు తానున్న ఆ పరలోకమునకు యేసు తిరిగి వెళ్ళెను.

ఆయన వెళ్ళుటకు ముందు, ఈ ప్రపంచమునకు తీర్పు తీర్చుటకు మరియు నీతి సమాధానములతో పాలించుటకు ఒక దినమున తిరిగి వచ్చెదనని వాగ్ధానము చేసెను. ఆయన భూమిపైకి తిరిగి వచ్చుటకు ముందు జరిగే నిర్ధిష్టమైన సూచనలను ప్రభువు మనకు యిచ్చెను.

మనము ఆ సూచనల నెరవేర్పు యిప్పుడు చూచినప్పుడు, క్రీస్తు యొక్క రెండవ రాకడ బహు సమీపములో నున్నదని తెలుసుకొనుచున్నాము.

ఆయన భూమి మిదికి తిరిగి వచ్చుటకు ముందే, క్రీస్తులో దేవుడు నీ ముందు వుంచిన పాప క్షమాపణను పొందుకొనుట ముఖ్యము.

5. మారుమనస్సును గూర్చిన యదార్థ సత్యము
పాపమునకు శిక్ష ఆత్మీయ మరణము ఆ విషయము మనము ఇదివరలో చూచితిమి, దాని అర్దము దేవుని సన్నిధి నుండి ఎన్నటికిని తెగిపోవటం. దానిని (పాపమునకు శిక్ష) యేసు సిలువపై అనుభవించెను. ఆయన తన తండ్రిచేత విడువబడెను.

యేసు దేవుడై యుండి. అంతరంగ మందు నిత్యుడై యుండి కూడా తన తండ్రి నుండి నిత్యత్వపు ఎడబాటు యొక్క వేదనను, స్వల్పకాలము అనగా సిలువపై మూడు గంటలు పూర్తి చీకటిలో, మనము నిత్యత్వమంతా నరకములో పడవలసిన బాధను ఆయన అనుభవించెను.

మన పాపములకు మనము పొందవలసిన శిక్షను ఆయనే పొందియున్నారు. అయితే దేవుని నుండి ఆ క్షమాపణను మనము తీసికోనట్లయితే మనము ఇంకను క్షమింపబడనివారమే మరియు ఆ శిక్ష నుండి విడుదల పొందని వారమే. ఈ కారణము చేతనే లోకములో అనేకులు క్రీస్తు వారి కొఱకు చనిపోయినను వారు దేవుని చేత క్షమింపబడిన వారు కాదు.

క్రీస్తు లోకమందలి పాపములన్నిటి కొఱకు ప్రతి మతములో ఉండిన ప్రజల కొఱకు చనిపోయినారు. అంతేకాని కేవలము క్రైస్తవుల యొక్క పాపముల కొఱకు మాత్రమే కాదు.

క్రీస్తు యొక్క మరణము ద్వారా, నీ కొఱకు దేవుడు వెలయిచ్చి కొనిన దానిని నీవు పొందుటకుగాను, మొదటిగా నీవు నీ పాపముల గూర్చి పశ్చాత్తాప పడవలెను. దీని అర్ధమేమిటంటే నీ యొక్క పాపమార్గము లన్నిటి గూర్చి నీవు బాధపడాలి మరియు నీకు తెలిసిన ప్రతి పాపమునుండి మనఃపూర్వకముగా విడిచిపెట్టుటకు ఆశ కలిగి యుండవలెను.

ప్రారంభములో దేవుని సంతోషపెట్టునదేదియో మరియు సంతోషపెట్టనిదేదియో నీ మనస్సాక్షికి అంతగా తెలియదు కనుక, నీ జీవితములో దేవునికి ఇష్టము కాని ప్రతి పని చేయకుండుట సాధ్యము కాదు. దేవుడు వాస్తవమైనవాడు గనుక ఆయన ఆ విషయములో బలవంతము చేయడు. ఆయన అడుగున దేమనగా, ఆయన ఇష్టపడని ప్రతి దానిని నీవు విడిచి పెట్టుటకు ఇష్టపడుట మాత్రమే.

ఏ విషయాల గూర్చి నీ మనస్సాక్షి నిన్ను ఒప్పింపజేస్తుందో వాటిని విడిచిపెట్టుటతో నీవు ప్రారంభించవచ్చు.

నీ యొక్క చెడు అలవాట్లను విడిచిపెట్టడానికి నీకు తగినంత శక్తి లేకపోవచ్చు. ఇక్కడ కూడ దేవుడు నీ బలహీనతను పూర్తిగ అర్ధం చేసుకుంటాడు. నీవు శక్తిగలిగి యుంటావని ఆయన అనుకోడు. ఆయన అడుగునదేమనగా, నీవు ఆ చెడు అలవాట్లను విడిచిపెట్టుటకు ఇష్టపడుచున్నావా? అని. నీవు మనస్పూర్తిగా మరియు యదార్దముగా పాపముతో కూడిన ప్రతి విషయాన్ని విడిచిపెట్టుటకు ఆసక్తిగలవాడవని ఆయన చూచినప్పుడు, నీవు అప్పటికి అనేకమైన చెడు అలవాట్లతో ఓడింపబడుచున్నను, నీవు ఏ రీతిగనున్నావో ఆలాగుననే ఆయన నిన్ను అంగీకరిస్తాడు.

ఇది ఎంత అద్బుతకరమైన శుభవార్త!

నీవు గతంలో చేసిన పొరపాటులను సరిచేసికొనుటకు చూపుతున్న ఆసక్తియే, నీ పాప మార్గములను విడిచిపెట్టుటకు ఇష్టపడు చున్నావనుదానికి నిదర్శనము. ఇక్కడ కూడ ఆయన నీకుండిన పరిమితులను అర్దం చేసుకుంటాడు. నీవు ఎంత తీవ్రముగా ప్రయత్నించినను, ఎన్నటికిని సరిచేసికోలేని నీ గత పాపములు వేలాదిగా కలవు. అయితే కొన్నిటిని నీవు సరిచేసి కొనవచ్చును. నీ సామర్ద్యము కొలది వాటిని సరిచేసుకోవాలని దేవుడు ఎదురుచూచుచున్నాడు.

ఉదాహరణకు, నీవు ఎవరి దగ్గరనైనా సొమ్మును దొంగిలించినట్లయితే, ఆ సొమ్ము నీవు సమకూర్చిన వెంటనే అది తిరిగి యిచ్చివేయుటకు నీవు ఇష్టపడాలి. నీ మాటల ద్వారా ఎవరినైనా బాధపరచినట్లయితే, అది నీకు జ్ఞాపకముండినట్లయితే, నీవు వెళ్ళి ( లేక ఉత్తరం వ్రాసి) నీవు పలికిన మాటలకు క్షమాపణ అడుగుటకు నీవు యిష్టపడవలెను. అటువంటి క్రియలే దేవుడు నీ యొక్క నిష్కపటతను ( నిజాయితీని) మరియు దీనత్వమును పరీక్షించుటకు వీలు కల్పిస్తాయి. ఆయన దీనులకు మాత్రమే సహాయమును ఇస్తారు మరియు దేవుని సహాయము లేకుండా మనము రక్షణ పొందలేము.

బైబిలు నిజమైన పశ్చాత్తాపమును, ‘విగ్రహములను విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుట’ అని చెప్పింది( 1 థెస్సలోనీకయులకు 1 వ అధ్యాయము 9 వ వచనము).

దేవుడు ప్రతివిధమైన విగ్రహారాధనను ద్వేషిస్తాడు. విగ్రహారాధన అంటే ఏమిటి? సృష్టికర్త కంటె ఎక్కువగా సృష్టింపబడిన దానిని ఉంచుటయే. ఆ సృష్టింపబడినది ధనము కావచ్చు, చక్కని స్త్రీ కావచ్చు, లేక మన యొక్క కీర్తి కావచ్చు.

సృష్టింపబడిన వస్తువులలో దేనినైనను ఎంచుకొనుట విరహారాధన - అది సృష్టికర్తకు బదులు సృష్టమును పూజించుట మరియు అది సమస్త పాపమునకు మూలము.

విగ్రహములు కర్ర, రాయి లేక లోహముతో చేయబడినవిగా కూడా అయి ఉన్నవి. అవి మనుష్యుల చేత తయారు చేయబడి, వారు పూజించే దేవుని సూచిస్తాయి. లోకమునకు సృష్టికర్త యొక్క చిత్రాన్ని ఎంతో దూరమైన పోలికలతో నైనను ఏ మానవుడు తన హస్తములతో తయారు చేయుట అసాధ్యము. విగ్రహములను నుపయోగించువారు చెప్పురీతిని, ‘దేవుని జ్ఞాపకము చేసికొనుటకు సహకరించు’ నని మనము విగ్రహాలను, చిత్రపటములను ఉపయోగించరాదు. సర్వశక్తుడైన దేవుని రూపమును నర, నారీ లేక జంతువువంటి సృష్టింపబడిన వాటి రూపములు తయారుచేసి, ఆయనను అగౌరవపరచగూడదు. దేవుడు మామూలు కంటికి గోచరించనివాడు మరియు ఆయన రూపమును వర్ణించుట కొఱకు చక్కగా తయారు చేయబడిన లేక చెక్కబడిన ఎంతటి విగ్రహము కంటె ఆయన మిక్కిలి గొప్పవాడు. ఏది ఏమైనా మనము దేవుని జ్ఞాపకముంచుకొనుటకు కంటికి కనబడే గుర్తు అక్కరలేదు. ఎందుచేతనంటే, మన సృష్టికర్తను రాత్రింబవళ్ళు మనకు నిరంతరము జ్ఞాపకమునకు తెచ్చి మనతో మాట్లాడే మనస్సాక్షి మనకందరకు ఉంది.

విగ్రహారాధన, మతపరమైన కార్యక్రమములు మరియు తీర్దయాత్రలు తరచుగా మనస్సాక్షి యొక్క స్వరము వినుటకు ప్రత్యామ్నాయమగుచున్నవి.

ప్రజలు దేవుని చట్టాలను మీరుతున్నప్పుడు మరియు భవిష్యత్తులో కూడ మీరే నిర్ణయము కలిగియున్నప్పుడు, వారు వేరువేరు మతపరమైన కర్మలు మరియు కార్యక్రమములు చేయుట ద్వారా మనస్సాక్షి యొక్క గొంతునొక్కటానికి చూచెదరు. వారు యిచ్చుచున్న అర్పణల ద్వారా మరియు తీర్దయాత్రల ద్వారా దేవుడు వారియొక్క అనేక పాపములను క్షమించునని వారు ఊహించుకుంటారు. కాని ఇది ఒక వంచన. దేవుడు మన మతపరమైన కర్మకాండలను మరియు కార్యక్రమములను చూడడు. మన మనస్సాక్షి యొక్క స్వరమును వినుచుంటిమో లేదో యని గమనించుటకు ఆయన మన హృదయములలోనికి చూస్తాడు.

ప్రతి విధమైన విగ్రహారాధన నుండి తిరుగుటతో పశ్చాత్తాపము ముడిపడి ఉంది. నిజమైన పశ్చాత్తాపములో మనము ప్రతివిధమైన సృష్టింపబడిన వస్తువుల నుండి ( సృష్టము నుండి) సృష్టికర్త వైపు తిరిగి, సర్వశక్తిగల దేవా, నీ వొక్కడవే పూజింపబడుటకు, సేవింపబడుటకు యోగ్యుడవు. ఇప్పటి వరకు సృష్టింపబడిన వానిని పూజించినందుకు విచారిస్తూ యున్నాను ఇప్పటి నుండి నా జీవితములో నీవే సర్వోన్నతుడవు అని చెప్పవలెను.

పశ్చాత్తాపము అనగా మనము మన ఉద్యోగాలను, మన కుటుంబాలను విడిచి, సన్యాసులవలె ఏదో అడవులలోనికి వెళ్లుట కాదు.

మనం కుటుంబాలను కలిగియుండాలని, జీవనోపాధి కొరకు పనిచేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ధనము సంపాదించుట యనునది పాపము కాదు గాని దేవుని కంటె ధనమును ప్రేమించుటయే పాపము. ఆధునిక నాగరికత కలుగజేయు సౌఖ్యములను ఉపయోగించుట పాపము కాదు గాని దేవునికంటె ఆ సౌఖ్యములను ప్రేమించుటయే పాపము.

దేవుడు మన శరీరాలను ఆహారము నిద్ర మరియు లైంగిక సంతృప్తి అనుభవించుట ద్వారా ఆనందించులాగున సృష్టించెను. వీటిలో ఏది కూడ తగనిది కాదు.

మనము తరచుగా కలిగే ఆకలి మరియు అలసట గూర్చి ఏలాగు సిగ్గుపడమో, అట్లే లైంగిక కోర్కె గురించి సిగ్గుపడనక్కరలేదు!! అయితే మనము ఆకలిగొనినప్పుడు ఆహారము దొంగిలించరాదు మరియు మనము పని స్థలములో పనిలో నున్నప్పుడు నిద్రించరాదు!! అటులనే మన లైంగిక కొర్కెలు తీర్చుకొనుట కొరకు మరియొకరిని పాడుచేయరాదు. దేవుడు వివాహమును ఏర్పరచినాడు - ఆయన ఒక పురుషునికి ఒక భార్య ఉండాలని కోరుచున్నాడు - ఆ రీతిగ లైంగిక వాంఛలు తీర్చబడతాయి. వివాహము ద్వారా కాకుండా, కలిగియుండిన ఏ లైంగిక సంబంధమైనా పాపమే. మనము ప్రతివిధమైన లైంగిక పాపమును గుర్చి పశ్చాత్తాపపడి, దానిని విడిచి, నిజాయితీతో దేవుని వైపు తిరుగవలెను.

నీవు తప్పక పశ్చాత్తాప పడవలసినది మరియు విడిచి పెట్టవలసిన పాపము మరియొకటి ఏమనగా నీవు ఇతరులను క్షమించలేనటువంటి స్వభావము. దేవుడు నీ పాపములను క్షమింపవలెనంటే, ఏ విధము చేతనైననూ నిన్ను బాధపరచిన వారి నందరిని నీవు క్షమించుటకు ఇష్టపడాలి. దేవుడు నీ యెడల చేసినట్లుగా నీవు యితరుల యెడల చేయవలెను. నీవు దీని చేయుటకు ఇష్టపడని యెడల, దేవుడు నిన్ను క్షమింపడు.

ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధముగా చెప్పెను “మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయిన యెడల, పరలోకమందున్న మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు”(మత్తయి 6 వ అధ్యాయము 15 వ వచనము).

నీకు మితిలేని హాని కలిగించిన వానిని క్షమించుట నీకు అతి కష్టముగా నుండియుండ వచ్చును. అప్పుడు నీవు ఆ వ్యక్తిని క్షమించుటకు సహాయము చేయుమని దేవుని ప్రార్ధించవచ్చును.

ఈ పని చేయుటకు దేవుని సర్వశక్తి నీకు సహాయముగా నుంటుంది. దేవుడు తన యొక్క సర్వశక్తితో నీకు సహాయము చేసినట్లయితే, నీకు అసాధ్యమైనది ఏదియు నుండదు.

మన పాపములు ఎంత చెడ్డవైనను సరే దేవుడు వాటినన్నిటిని క్షమించగలడు.

అయితే వాటిని గూర్చి మనము పశ్చాత్తాప పడినపుడు మాత్రమే. అనగా మనము నిజముగా మన పాపముల గూర్చి దుఃఖించుచూ మన గత పాపపు మార్గములను మనస్పూర్తిగా విడిచిపెట్టుటకు కోరుకోవాలి.

6. విశ్వాసమును గూర్చిన యదార్థ సత్యము
ఒకసారి మనము పశ్చాత్తాపము పొందిన తరవాత దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందుటకు కావలసినది విశ్వాసము.

‘మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు’ అని బైబిలు చెబుతుంది( ఎఫెసీయులకు 2 వ అధ్యాయము 8 వ వచనము).

కృప అనగా - ఆయన సహాయము మరియు ఆశీర్వాదము మనకు అందించుటకు చాపబడిన దేవుని హస్తము. విశ్వాసము అనగా - ఆ సహాయము మరియు ఆశీర్వాదము మనము దేవుని నుండి అందుకొనుటకు చాచిన మన హస్తము.

మనము ముందు చూచినట్లు, ఏ పని చేయమని ఆజ్ఞాపించి మీట నొక్కితే ఆ పనిని అక్షరాల నెరవేర్చే మెదడు లేని మరబొమ్మలు దేవునికి అక్కర్లేదు.

దేవుడు మంచి దేవుడనియు, ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడనియు నీవు నమ్ముచున్నావా? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును నీ పాపముల కొఱకు సిలువపై చనిపోవుటకు పంపెననియు, దేవుడు ఆయనను మృతులలో నుండి మూడవ దినమున లేపెననియు ఆయన ఇప్పుడు పరలోకములో సజీవుడుగా నున్నాడనియు నీవు నమ్ముచున్నావా? అట్లయితే దేవుడు నీకు యివ్వగోరిన క్షమాపణ ఇప్పుడే నీవు పొందగలవు. నీవు దానిగూర్చి ఎదురుచూడనక్కరలేదు.

ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు నామమున తప్ప మరి ఏ నామమున పాపము నుండి మరియు నరకము నుండి రక్షణ దొరకదు. నీవు ఆయనను ప్రభువుగా మరియు రక్షకునిగా చేర్చుకోవాలంటే, వివాహములోవలె ‘అన్నిటిని విడిచి ఆయనను మాత్రమే హత్తుకొందును’ అనునది ముఖ్యమైనది. వివాహములో ఒక స్త్రీ తనకుండిన మొదటి ప్రియులను విడిచిపెట్టి, తన మిగిలిన జీవితమంతయు ఒకే మనుష్యుని తన భర్తగా హత్తుకొని యుండవలెను.

ప్రభువైన యేసుక్రీస్తుతో మన సంబంధాన్ని బైబిలు ఆత్మీయ వివాహముతో పోలుస్తుంది. అందులో ఆయన ఒక్కడే మనయొక్క దైవిక భర్త. కనుక నీవు క్రీస్తును అంగీకరించుటకు యిష్టపడుచున్నాననియు మరియు ఇతర దేవుళ్ళను పూజిస్తానని లేక ప్రార్దిస్తానని కూడ చెప్పడానికి వీలు లేదు. నీవు ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి.

అటువంటి ఎంపిక చేసుకోవాలంటే, ఇదే సమయము.

కేవలము ఇప్పుడేమోకాళ్ళూని, నీ కండ్లు మూసికొని, హృదయపూర్వకముగా ఈ మాటలు దేవునికి చెప్పు. నీవు ఎక్కడ ఉన్నప్పటికి ఆయన నీ మాటలు వినగలడు. ఆయన నీవు చెప్పేది వినటానికి ఆసక్తి కలిగియున్నాడు. ఈ మాటలు అర్దవంతముగా మరియు నెమ్మదిగా చెప్పు ‘ప్రభువైన యేసు క్రీస్తూ! నేనొక పాపిని మరియు నేను నిజముగా నా పాపములన్నిటి నుండి మరలుటకు యిష్టపడుచున్నాను. నీవు నా పాపములన్నిటి కొఱకు చనిపోయినావనియు, మృతులలో నుండి తిరిగి లేచి ఈనాడు సజీవునిగా నున్నావనియు నేను నమ్ముచున్నాను. దయచేసి నా పాపములన్నిటిని క్షమించు, నా హృదయములోనికి మరియు నా జీవితములోనికి వచ్చి ఇప్పటి నుండి నా జీవితమునకు ప్రభువుగా నుండుము. నేను మిగిలిన దేవుళ్ళను విడిచి, ఇప్పటి నుండి నిన్ను మాత్రమే పూజించుటకు కోరుచున్నాను.’

అది చాలా సుళువుగా చెప్పగలిగే అతి సామాన్యమైన ప్రార్దన, దానికి ఒక నిమిషముకన్న తక్కువ సమయము సరిపోతుంది. కాని అది నీవు మనస్పూర్తిగా దేవునికి ప్రార్దించినట్లయితే, నిత్యత్వమంతటికి నీ ఆత్మ రక్షింపబడుతుంది. నీవు వెంటనే దేవుని బిడ్డవు కాగలవు. ఎవరైతే చిలుకవలె వల్లిస్తారో అట్టివారికి దివెనయిచ్చే మంత్రము కాదు. ఇదియంతయు హృదయము యొక్క నిష్కాపట్యముపై ఆధారపడి యుంటుంది. నీవు చెప్పేదాని అర్థము ఎరిగియుంటే, దేవుడు నీ పాపములను క్షమిస్తాడు నిన్ను అంగీకరించి, తన బిడ్డగా నిన్ను చేసుకుంటాడు. నీవు నిజాయితీ లేనివాడవైతే, మార్పులేనివాడవుగనే ఉండిపోతావు.

మనము దేవునిచే నిజముగా క్షమించబడి అంగికరించబడి, ఆయన యొక్క బిడ్డలముగా చేయబడితిమను నిశ్చయత కలిగి యుండుట చాల ముఖ్యమైనది. అటువంటి నిశ్చయత లేకుండా మనము ఉండుట దేవుడు కోరుకొనుటలేదు. ఆయన పరిశుద్దాత్మ మనలోనికి వచ్చుట ద్వారా మరియు మనము దేవుని బిడ్డలమని చెప్పుట ద్వారా దేవుడు ఈ నిశ్చయతను కలుగజేయును. ఆయన యొక్క వ్రాతపూర్వకమైన వాక్కు ( బైబిలు) నందలి వాగ్దానముల ద్వారా కూడ దేవుడు ఇదే నిశ్చయతను కలుగజేయును.

ప్రభువైన యేసుక్రిస్తు ఈ విధముగా చెప్పెను ‘నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును త్రోసివేయను’(యోహాను 6 వ అధ్యాయము 37 వ వచనము).

మనము నిత్యత్వమనే శాశ్వత కాలమంతా క్రీస్తు యొక్క వాగ్దానముపై ఆధారపడవచ్చును.

ఇప్పుడు నీవు చేసిన ప్రార్దన మనస్పూర్తిగా ప్రభువైన యేసు క్రీస్తునకు చేసావా? అట్లయితే నీవు తప్పనిసరిగా ఆయన దగ్గరకు వచ్చావు. అప్పుడు ఆయన నిన్ను త్రొసివేయలేదని తప్పక నమ్మవచ్చు. ఆయన నిన్ను అంగీకరించాడు ఆయన యొద్దకు నీవు వచ్చుట ద్వారా నీ వంతు నెరవేర్చిన యెడల, దేవుడు నిన్ను అంగీకరించుట ద్వారా ఆయన వంతు నెరవేర్చియున్నాడని నీవు రూఢి పరచుకోగలవు.

దేవుడు నిన్ను అంగీకరించాడా లేదా అనేది నీ అనుభూతులపై ఆధారపడవద్దు. ఈ అనుభూతులు మన భౌతిక శరీరములకు సబంధించినవి మరియు ఆత్మీయ విషయములలో అవి బహుగా మోసపరుస్తూ ఉంటాయి.

మన నమ్మకాన్ని అనుభూతులపై ఉంచుట అనేది ఇసుకపై ఇంటి పునాది వేయటంవంటిది మన నమ్మకాన్ని ఆయన వాక్యములో నుండిన వాగ్దానాలపై నిలపాలి - అది రాతిపైన కట్టబడిన కట్టడము వంటిది.

ఒక మారు నీవు దేవుని బిడ్డగా అయినావనే నిశ్చయత నీకు కలిగినప్పుడు, ఆ వాస్తవాన్ని నీవు బహిరంగముగా ఒప్పుకొనవలెను. నీవు హృదయములో నమ్మిన దానిని, నీ నోటితో ఒప్పుకొనవలెనని బైబిలు చెబుతుంది. కనుక నీవు యేసుక్రీస్తును ఇప్పుడు నీ రక్షకుడని మరియు నీ ప్రభువని నీ పెదవులతో ఒప్పుకొనవలెను. నీవు నీ స్నేహితులకు మరియు బంధువులకు క్రీస్తు నీ పాపములు క్షమించెనని మరియు ఆయనయే నీ జీవితానికి ఏకైక ప్రభువని చెప్పవలెను.

అప్పుడు క్రీస్తుతో నీకుండిన సంబంధాన్ని బాప్తిస్మము ద్వారా ఒప్పుకొనవలెను. నీ హృదయాన్ని మరియు నీ జీవితాన్ని క్రీస్తుకు యివ్వవలెనని నిర్ణయించుకొనిన తరువాత సాధ్యమైనంత త్వరలో నీవు బాప్తిస్మము పొందవలెను. బాప్తిస్మము అనేది మతపరమైన కర్మకాండ కాదు. ఇప్పుడు నీవు క్రీస్తుకు మాత్రమే చెందినవాడవని దేవునికి, ప్రజలకు, దేవదూతలకు మరియు సాతానుకు యిచ్చే బహిరంగ సాక్ష్యము.

తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ నామములో వేరొక క్రైస్తవుడు నీటిలో (చెఱువులోగాని, నదిలోగాని) నిన్ను పూర్తిగా ముంచి తిరిగి నీటిలో నుండి పైకి లేవనెత్తుట అనునది బాప్తిస్మములో నుంటుంది. ఈ చిన్న కార్యము ద్వారా నీలోగల పాత వ్యక్తి చనిపోయాడనే వాస్తవాన్ని నీవు సాక్ష్యమివ్వగలను. నీవు పూర్తిగా నీటిలోమునుగుట ద్వారా అతనిని సూచనార్దముగ పాతిపెట్టితివి.

నీటి నుండి పైకి వచ్చుట ద్వారా నీవు ఇప్పుడు నూతన వ్యక్తివైతివని ( ఆత్మీయముగా చెప్పవలెనంటే మృతి నుండి లేవటం) దేవునిని మాత్రమే సంతోష పరచటానికి కోరుకుంటున్నానని నీవు ఒప్పుకొంటున్నావు.

నీవింకను పరిపూర్ణుడవు కాలేదు. నీవు పరిపూర్ణుడవగుటకు ఒక జీవిత కాలమంతయు తీసుకుంటుంది. కాని నీ యొక్క జీవిత గమనపు దిశను నీవు మార్చుకొన్నావు. నీవు ఇక ఎంతమాత్రమునూ పాపము చేయుటకు గాని లేక దేవునికి దుఃఖము కలిగించుటకు ఇష్టపడవద్దు.

నీవు ఇప్పుడు పరలోక పౌరుడవు మరియు దేవుని బిడ్డవు.

7. రక్షణను గూర్చిన యదార్ధ సత్యము
‘యేసు’ అను పేరునకు ‘రక్షకుడు’ అని అర్దము.

ఆయన ఈ భూమిపైకి ప్రజలను వారి పాపములనుండి రక్షించుటకే వచ్చియున్నారు గనుక, ఆ నామము ధరించుకొని ఈ భూమిపైకి వచ్చెను. పాపక్షమాపణ కంటె రక్షణ ముఖ్యమైనది.

ఈ తేడాను తేటగా తెలుపుటకు ఒక దృష్టాంతమును ఉపయోగిస్తాను.

నా యింటి ముందుగల రోడ్డు మరమ్మత్తులకై ఒకలోతైన గోతిని త్రవ్వితిరను కొందము. నేను నా చిన్న కుమారునితో ‘ఆ గొతి దగ్గరకు వెళ్ళవద్దు నీవు అందులో పడిపోవచ్చు’ అని హెచ్చరించితిని. కాని అతడు ఆ ఆజ్ఞను మీరి ఆ గోతి దగ్గరకు తొంగి చూడటానికి వెళ్ళాడు. అతడు జారి, అందులో పడిపోయినాడు. ఆ పది అడుగుల లోతైన గోతిలో నుండి, అతడు నన్ను అరచుచు పిలుచుచున్నాడు.

నేను అక్కడకు వచ్చినప్పుడు, అతడు నా యాజ్ఞను మీరినందుకు నిజముగా చింతిస్తూయున్నానని, తనను క్షమించమని నను అడిగాడు. అప్పుడు నేను ‘సరే కుమారుడా! నేను నిన్ను క్షమించాను, వెళ్ళివస్తాను’ అని చెప్పినట్లయితే, అప్పుడు నేను ఏమి చేసినట్లు, అతనిని క్షమించి ఉండవచ్చును గాని, అతనిని రక్షింపకపోయి ఉండేవాణ్ణి.

క్షమాపణ కంటె రక్షణ అధికమైన వాటితో ముడిపడియుంది. అతడు పడిన గోతిలో నుండి అతనిని నేను పైకిలాగుట కూడ అందులో ముడిపడియుంది.

మన కొఱకు యేసు దీనిని చేయటానికి వచ్చియున్నారు. ఆయన మన పాపములను క్షమించుట మాత్రమే కాక, ఆయన మన పాపముల నుండి మనలను రక్షించుటకు కూడ వచ్చియున్నారు.

మనమందరము మన మనస్సాక్షికి మరల మరల లోబడకపోవుట ద్వారా పాపపు గోతిలో మిక్కిలి లోతునకు పడిపోయియుంటిమి. ఇప్పుడు దేవుడు మనలను రక్షించుట యనేదే అద్భుతమైన వార్త. అయితే అంతకు మించి క్రీస్తును గూర్చిన శుభవార్త ఆయన మనలను క్షమించుటయే కాక పాపపు శక్తి నుండి కూడా మనలను రక్షించుట.

రక్షణను మనము మూడు కాలములలో - భూత, వర్తమాన, భవిష్యత్కాలములలో అనుభవించాలి. మొదటిగా, మనము పాపము యొక్క శిక్ష నుండి రక్షింపబడాలి. తరువాత పాపము యొక్క శక్తి నుండి రక్షింపబడాలి. చివరిగా పాపము యొక్క ఉనికి నుండి పరలోకమునకు వెళ్ళినపుడు రక్షింపబడెదము.

రక్షణలో మొదటి భాగము మన పాప క్షమాపణను అనగా గత జీవితము యొక్క అపరాధమును తీసివేయుటకును సంబంధించినది.

కాని అదిసరిపోదు. మనము భవిష్యత్తులో కూడ యదార్దముగా జీవించుటకు దేవుని యొద్ద నుండి సహాయము కావలెను. దీని కొరకు దేవుడు మనకు తన శక్తిని ఇచ్చును.

మానసికముగా మంచి స్థితి లేనివారు చికిత్స కొరకు చేర్చబడే ఒక మానసిక రోగ చికిత్సాలయము ( పిచ్చి ఆసుపత్రి) గూర్చిన ఒక కథను నేను వినియున్నాను. అందులో చేరినవారు సరియైన రీతిలో ఆలోచించగలుగునట్లు బాగుపడితిరో లేదో తెలుసుకొనుటకు ఒక పరీక్ష పెట్టెదరు. తెరువబడిన కుళాయి గుండా నీరు వచ్చుచున్న గదిలో వారిలో ఒకనిని ఉంచెదరు. అతనికి ఒక బకెట్టు, గచ్చుతుడిచే గుడ్డ యిచ్చి గచ్చును పొడిగా తుడవమని చెప్పెదరు. అతడు మొదటిగా కుళాయిని కట్టకుండా ఆ పని చేయుటకు ప్రయత్నించినట్లయితే, అతడింకను తన బుద్దిలోనికి రాలేదన్నమాట.

మన సమస్య కూడ అదే. మనలోపల కూడ ఒక కుళాయి ఉన్నది. అది ఎల్లప్పుడూ పాపన్ని బయటకు చిమ్ముతూవుంటుంది. యేసు మనము చేసిన పాపములను తుడిచివేయుటయే కాదు. ఆ కుళాయిని కట్టివేయుటకు కూడ మనకు శక్తినిస్తారు. లేనట్లయితే సువార్త అసలు మంచి వార్త కానేరదు.

బైబిలులో సువార్త (శుభవార్త) ‘రక్షించుటకు దేవుని శక్తియైయున్నది’ అని వివరించబడింది ( రోమీయులకు 1 వ అధ్యాయము 16 వ వచనము).

శక్తికి మొదటి ఆధారము దేవుని వాక్యము. దేవుని వాక్యము శోధనను జయించుటకు మనకు సహాయపడే శక్తిగల ఒక ఆయుధమైయున్నది( బైబిలు). యేసు తానే సాతాను యొక్క శోధనలను దేవుని వాక్యము యొక్క శక్తితో జయించెనని బైబిలులో చదువగలము(మత్తయి 4 వ అధ్యాయము 1 నుండి 11 వచనములు).

అందు చేతనే దేవుని వాక్యమును ప్రతిరోజు చదివే అలవాటును వృద్దిచేసుకొనాలి. ఆ విధముగా దేవుడు మనతో మాట్లాడి దైనందిన జీవితములో పోరాటములను ఎదుర్కొనేలాగున మనలను బలపరుస్తాడు.

యౌవనస్థులకు బైబిలు ‘మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించియున్నారు’. అని చెప్పుచున్నది. ( 1 వ యోహాను 2 వ అధ్యాయము 14 వ వచనము).

శక్తినొందుటకు రెండవ మూలము - మనలో జీవించుటకు వచ్చిన దేవుని యొక్క పరిశుద్దాత్మ. ఆయన మనలో శాశ్వతముగా జీవించి, ప్రతి దినము మనతో మాట్లాడుచు, జీవితపు పోరాటములను ఎదుర్కొనుటకు బలపరచి, యేసు శిష్యులుగా యేసు యొక్క అడుగుజాడలలో నడచుటకు సహాయము చేయవలెనని ఆయన కోరుచున్నాడు. మనము ఎడతెగక పరిశుద్దాత్ముని చేత నింపబడునట్లు దేవుని అడుగవలెను.

ప్రభువైన యేసు చెప్పెను “ మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్దాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను” ( లూకా 11 వ అధ్యాయము 13 వ వచనము).

శక్తినొందుటకు మూడవ మూలము - మనవంటి మనసు కల్గిన క్రైస్తవులతో సహవాసము చేయుట.

ఎప్పుడైతే అనేకమైన బొగ్గులు అగ్నితో కలిసి ఉంటాయో, అప్పుడు అవన్నియు ప్రకాశవంతముగా కాలుతూ ఉంటాయి. కాని ఒక బొగ్గు( అది ఎంతో గొప్పగా కాలుతున్నదైనా) ను బయటకు తీసివేసినట్లయితే త్వరలోనే అది ఆరిపోతుంది. ఇతర క్రైస్తవుల సహవాసం లేకుండా మనకు మనమే దేవుని కొరకు జీవించాలనుకుంటే మనము కూడా అలాగే చల్లారిపోతాము.

అయితే ఇక్కడే మనము జాగ్రత్త కలిగి యుండాలి. ‘క్రైస్తవులని’ పిలిపించుకొనే ప్రతివారు క్రైస్తవులు కారు.

వాస్తవానికి క్రైస్తవులని పిలిపించుకొనే వారిలో 90% మంది నిజమైన దేవుని బిడ్డలు కాదని చెప్పడం శ్రేయస్కరం ( వారు ఎటువంటి క్రైస్తవ గుంపుకు లేక శాఖకు చెందినవారైనా సరే) వారు వారి పాపములను విడిచిపెట్టుటకు, క్రీస్తును వారి జీవితములో ప్రభువునుగా స్వీకరించుటకు వారు వ్యక్తిగత నిర్ణయము తీసుకున్నవారు కాదు. తాము క్రైస్తవ కుటుంబములో ‘జన్మించుట అనే సంఘటన’ ద్వారానే తాము క్రైస్తవులమని ఊహించుకొంటారు.

కేవలం పేరుకు మాత్రము క్రైస్తవులైన వారిని తప్పించుకొని ఎవరైతే అనుభవము ద్వారా క్రైస్తవులుగా నుందురో, ఎవరైతే వారి దైనందిన జీవితాలలో యేసుక్రీస్తును వెంబడించుటకు ఆశతో వెదకుచున్నారో అట్టివారి సహవాసం వెదకాలి.

ఎప్పుడైతే మనము క్రీస్తును మన యొక్క ప్రభువుగాను, రక్షకునిగాను చేర్చుకొందుమో అప్పుడు మనము పైనుండి పుట్టినవారమని బైబిలు చెబుతుంది. ఎందుకంటే మనము దేవుని బిడ్డలమైతిమి. దేవుడు ఇప్పుడు మన తండ్రియై యున్నాడు. ఈ లోకపు తండ్రివలెనే, దేవుడు కూడా ఈ భూమిపైన మన జీవితమునకు అవసరమైన వన్నియూ - ఆత్మీయము మరియు భౌతికము అను రెంటిని సమకూర్చుటకు ఆసక్తి కలిగియున్నాడు.

మన జివితములో దేవుని కిష్టమైన వాటిని మొదట వెదకిన యెడల, ఈ లోకములో మనకు అవసరమైన ఇతర వస్తువులన్నియు సమకూర్చబడునని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పెను.

‘ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. మీ జీవితములో ఆయనకు మీరు మొదటి స్థానమిచ్చిన యెడల ఆయన కిష్టమైన విధముగా మీరు జీవించిన యెడల వాటన్నిటిని ఆయన మీ కిచ్చును అని ఆయన చెప్పెను’. ( మత్తయి 6 వ అధ్యాయము 33 వ వచనము).

దేవుని బిడ్డకు గల గొప్ప ఆధిక్యతలలో ఒకటి ప్రార్దించే ఆధిక్యత - అది దేవునితో మాట్లాడుట మరియు దేవుడు తనతో తన ఆత్మతో మాట్లడునది వినుట. దేవుడు సాధారణముగా మన చెవులతో వినగలిగే స్వరముతో కాక మనలో నుండిన మన ఆత్మలో ఒక తలంపు కలుగజేయుట ద్వారా మాట్లాడును. అది వినదగినట్టి స్వరమంత యదార్దమైనది. మన హృదయాలలో భారము కలిగించే ప్రతి విషయాన్ని దేవునికి చెప్పమని, యేసు మనలను ప్రొత్సహిస్తున్నారు. అనేక మంది ప్రజలు వారి బాధలు చెప్పుకోవటానికి ఎవరును లేక మౌనముగా బాధపడుతుంటారు. కాని దేవుని బిడ్డకు తన ప్రతిభారము పంచుకొనుటకు ఒక తండ్రి పరలోకములో నున్నారు. అతడు భూమిపై తనకు అవసరమైన ప్రతి యొక్కటి తన పరలోకపు తండ్రి సమకూర్చగలడని కూడ ఆయనపై నమ్మికయుంచగలడు.

దేవుని అడుగుట ద్వారా కొన్ని పరిస్థితులను మార్చుట ఎట్లో ప్రభువైన యేసుక్రీస్తు మనకు బోధించెను. ఇది ప్రార్దన యొక్క అద్బుతము.

మనకు, మన కుటుంబాలకు గాని ఏ విధము చేతనైనను, నష్టము కలిగించే పరిస్థితులు కల్గినప్పుడు అది దైవ కృతమని ( జరిగిన ప్రతిది దేవుని చిత్తమని చెప్పుతూ) అంగీకరించనక్కర్లేదు. విధివశము అనునది దేవుని చిత్తమునకు లోబడుట అనుదానికి వేరైనది. మనకు అవసరమైన దాని గూర్చి దేవుని అడుగునట్లు మనము ప్రోత్సహింపబడుచున్నాము.

‘దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును అని బైబిలులో వాగ్దానము గలదు.(పిలిప్పీయులకు 4 వ అధ్యాయము 19 వ వచనము).

కాని జ్ఞానముగల ప్రతి తండ్రి వలెనే, దేవుడు కూడ మనము కోరినది మరియు అడిగిన ప్రతి యొక్కటి మనకు యివ్వడు. మనకు అవసరమైనది మరియు ఏది మనకు మేలుకరమైనదిగ ఆయన చూస్తాడో దానిని మత్రమే ఆయన యిస్తాడు.

దేవుడు మంచి దేవుడు మరియు ఆయన తన పిల్లలలో ఎవరికైనను, ఎప్పుడైనను ఏదైనా కీడు జరుగుటకు ఆయన ఇష్టపడడు.

గనుక ఆయన యొద్దకు మనము ధైర్యముగా వెళ్ళి, ప్రతి కీడు నుండి మనలను విడిపించమని ఆయనను అడుగవచ్చును.

ఈ లొకములో అనేకులు ఇతరులు వారికి చెడుపు, చిల్లంగి పెట్టుట ద్వారా బాధపడుచున్నారు. నీవు నీ హృదయమును నీ జీవితమును క్రీస్తుకు ఇచ్చినట్లయితే అటువంటి సాతాను క్రియలు నిన్ను ఇకపై ఏ మాత్రము హానిచేయలేవు. సాతానును తరిమి వేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు నామము ( ఎవరైతే సాతానును ఓడించారో) ను నీవు ఉపయోగించగలవు.

నీవు యేసుక్రీస్తు నామములో ఎదిరించినట్లయితే ఏ చెడుపు, చిల్లంగి నిన్నుగాని నీ బిడ్డలనుగాని ముట్టుకొనలేవు, హానిచేయలేవు. నిన్ను రక్షించుమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో మొఱలిడినచో - నీపై ప్రయోగింపబడిన ఏ చిల్లంగి శక్తియైనను ఇప్పుడే - ఈ క్షణమందే వెడల గొట్టబడును.

యేసు సిలువపై మరణించినప్పుడు, ఆయన సాతానును ఓడించి, వాని యొక్క శక్తిని కొట్టివేసెనని బైబిలు చెబుతుంది. అది అప్పుడే జరిగిపోయినది. అయితే నీ పాపముల యొక్క క్షమాపణవలెనే, ఈ విషయములో గూడ, నీ మట్టుకు నీవు అంగీకరించు వరకు సాతాను యొక్క ఓటమి ఒక యదార్దము కాదు.

అపవాదిని ( సాతానును) మరణము ద్వారా నశింప జేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, ఆయన(యేసు) కూడ రక్త మాంసములలో పాలివాడాయెను.(హెబ్రీయులకు 2 వ అధ్యాయము 14,15 వచనములు).

‘దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును’.( యాకోబు 4 వ అధ్యాయము 7 వ వచనము).

మనము దేవుని బిడ్డలమయిన తరువాత కుడ సాతాను మనలను శోధించుటకు అనుమతిస్తాడు, ఎందుకనగా ఆ రీతిని మనము బలవంతులము కాగలము.

మనలో యిప్పుడు నివసించుచున్న దేవుని యొక్క పరిశుద్దాత్మ శక్తి, సాతాను యొక్క దాడులను ఎదిరించుటకు మరియు జయించుటకు మనకు శక్తినిచ్చును.

తన బిడ్డలు, భూ సంబంధమైన జీవితములో బాధలు, సమస్యలు లేకుండా యుందురని, దేవుడు వాగ్దానము చేయలేదు.

పుట్టుక నుండి గారాబము చేయబడి చెడిపొయిన ధనవంతుల పిల్లలవలె కాక, మనము కష్టనష్టములకు ఓర్చుకొని మరియు బలముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలను బలవంతులుగా తయారుచేయుటకు, మనము ఇతర మానవ మాత్రులవలెనే జీవితములో పరీక్షలు మరియు సమస్యలు ఎదుర్కొనేటట్లు ఆయన అనుమతిస్తాడు. అయితే ఆ శోధనల యందు ప్రతి పరిస్థితిలో ఆయన యొక్క అద్బుత సహాయమును మనము అనుభవించుట ద్వారా దేవునిని అధికముగా తెలిసికొందుము.

8. నిత్యత్వమును గూర్చిన యదార్ద సత్యము
దేవుని బిడ్దగా మారిన వానికి, ప్రస్తుత కాలమందలి సంగతుల కంటె, నిత్యత్వమును గూర్చిన సంగతులు ఎక్కువ విలువైనవిగ నుండును. అతనికి భూ సంబంధమైన వాటి విలువలకంటె పరలోక సంబంధమైన వాటి విలువలు ఎంతో ముఖ్యమైనవిగ నుండును.

2000 సంవత్సరముల క్రిందట, ప్రభువైన యేసు క్రీస్తు మరణము నుండి లేచిన తరువాత, పరలోకమునకు ఆరోహణమైనప్పుడు, తిరిగి భూమిపైకి వచ్చెదనని వాగ్దానము చేసెను.

దీనిని ‘క్రీస్తు రెండవ రాకడ’ యందుము. ఇది ప్రపంచ చరిత్రలో తరువాత వచ్చు గొప్ప సంఘటన.

క్రీస్తు ఈ భూమిపైకి తిరిగి వచ్చినపుడు, దేవునికి తన జీవితమంతటిని గూర్చి లెక్క అప్పగించవలెనని దేవుని బిడ్డకు తెలియును.

ఈ లోకము మనయొక్క పరలోక ప్రయాణపు త్రోవలో నుండిన ఒక జరిగిపోయే దశ. ఇప్పుడు మనము పరీక్షించబడు చుండిన కాలమందున్నాము జీవిత పరిస్థితుల ద్వారా మనము పరలోకపు విషయాలను ఎంచుకొంటామో లేక అశాశ్వతమైన ఈ లోకపు విషయాలను ఎంచుకొంటామో యిప్పుడు దేవుడు పరీక్షిస్తున్నారు. మనము జ్ఞానము గలవారమైతే, నిత్యత్వములో విలువ ఉండే విషయాలను మనము ఎంచుకొంటాము.

ఒక చిన్న బిడ్డ ఒక 500 రూపాయల నోటుకు బదులుగా ఒక మెరుస్తున్న రంగు కాగితమును ఇష్టపడతాడు. ఎందుకంటే ఈ బిడ్డకు విలువల ప్రాధాన్యత తెలియదు. మనము పరలోకము మరియు నిత్యత్వ విషయాలకు బదులు ఈ లోకపు విషయాలను ఎంచుకొనినట్లయితె మనము అటువంటి చిన్నబిడ్డవలె ప్రవర్తిస్తూ యున్నాము.

ఈ లోకము మరియు అందులో నుండినవన్నియు గతించిపోవును అని దేవుడు బైబిలులో చాల తేటగా చెప్పియుండెను.

ఈ లోకము యొక్క అశాశ్వతమైన విషయాల గూర్చి జీవించుట ఎటువంటిదనగా చాల తొందరలో దివాలా తీయబోవుచున్న బ్యాంకులో డబ్బు జమచేయుట వంటిది.

ఒక జ్ఞానము గలిగిన వ్యక్తి తన ధనాన్ని స్థిరముగా నుండే బ్యంకులో నిలువచేస్తాడు. అదే విధముగా తెలివైనవారు నిత్యమైన విలువగల విషయాల కొఱకు జీవిస్తారు - అవి మన గుణమునకు సంబంధించినవి - పవిత్రత, ప్రేమ, మంచితనము, క్షమాగుణము, దీనత్వము మొదలైనవి, వీటిని మాత్రమే మనము ఈ భూమిని వదిలినప్పుడు మనతో తీసికొనివెళ్ళగలము.

ఎవరైతే వారి పాపముల కొఱకు మారుమనస్సు పొందకుండా చనిపోవుదురో వారి అంతము భయంకరముగా నుంటుందని బైబిలు చెబుతుంది.

‘మనుష్యులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును’.(హెబ్రీయులకు 9 వ అధ్యాయము 27 వ వచనము)

మనుష్యుడొకమారు చనిపోయినట్లయితే అతనికి ఇక మార్పు చెందుటకు అవకాశముండదు. దేవుడు కూడ అటువంటి వ్యక్తిని మార్చడు. ఎందుకనగా ఒక వ్యక్తి యొక్క యిష్టమునకు వ్యతిరేకముగా దేవుడు అతనిని మార్చడు. ఈ భూమిపైన మనము మారుటకు ఇష్టపడితేనే దేవుడు మనలను మార్చును.

భవిష్యత్తులో రానైయున్న ఒక రోజున ఈ భూమిపై జీవించిన ప్రతి వ్యక్తి తన జీవితము యొక్క లెక్క దేవునికి అప్పగించుటకు మృతులలో నుండి లేపబడుదురు.

రెండు పునరుత్దానములు కలవని బైబిలు చెప్పుచున్నది. అది దేవుని యొక్క అతీతమైన శక్తిచేత ధూళిగా మారిపోయిన మృత శరీరములు తిరిగి మామూలు శరీరములుగా లేపబడుట.

ఎవరైతే క్రీస్తు వైపు తిరిగియున్నారో, ఎవరి పాపములు క్షమించబడినవో మరియు ఎవరైతే భూమి మీద నుండగనే దేవుని బిడ్డలుగా మారితిరో అట్టి నీతిమంతులకు మొదటి పునరుత్థానముండును.

ఎవరైతే వారి పాపములు క్షమించబడకుండా చనిపోతిరో ఎవరైతే క్రీస్తును తమ రక్షకునిగా మరియు ప్రభునిగా అంగీకరించ లేదో వారికి రెండవ పునరుత్థాన ముండును.

ఒక వ్యక్తి తన పాపముల గురించి పశ్చాత్తాపపడకుండా, తన పాపముల క్షమాపణ గురించి క్రీస్తునందు నమ్మిక యుంచకుండనట్లయితే చనిపోయి ఒకనాడు అతడు దేవుని తీర్పు సింహాసనము ముందు తీర్పు తీర్చబడతాడు. అక్కడ అతని జీవితమంతా తిరిగి చూపబడుతుంది. అప్పుడు విశ్వమంతటికి అతని పాపముల గూర్చిన నిత్య తీర్పు వానికి తగినదేయని ఋజువు చేయబడుతుంది.

అప్పుడతడు నిత్యమైన శాశ్వత కాలమంతా అగ్నిగుండములోనికి త్రోసి వేయబడతాడు. అది ఎన్నటికిని అంతములేని శిక్ష. ఎవరైతే క్రీస్తును త్రోసిపుచ్చుతారో అటువంటి వారికి, నిత్యత్వమంతా ఎదుర్కొనవలసిన భయంకరమైన భవిష్యత్తు ఇది.

మానవులనందరిని పాపములోనికి నడిపించి, ఈ ప్రపంచములో చెడును మొదలుపెట్టిన సాతాను అందరికంటె ముందుగా అగ్నిగుండములోనికి త్రోయబడతాడు.

మరియొక వైపు, ఎవరైతే తమనుతాము తగ్గించుకొని, తమ పాపములను తెలిసికొని, ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టి, సిలువపై క్రీస్తు మరణించుట ద్వారా దేవుడు అందిస్తున్న క్షమాపణను స్వీకరించారో వారు నిత్యత్వమంతా దేవునితోను, యేసుక్రీస్తుతోను నివసించుటకు పరలోకపు ఆనందాలలోనికి ప్రవేశిస్తారు.

పరలోకము స్వచ్చత, సమాధానము మరియు సంతోషముగల ప్రదేశము, అచ్చట దేవదూతలు, పాపములనుండి రక్షింపబడిన మానవజాతి దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ యుందురు మరియు ఆయనను నిత్యత్వమంతా అనేకరీతులుగా పరిచర్యచేయుదురు.

వారి రక్షణ విషయమై క్రీస్తును నమ్మి దేవుని బిడ్డలుగా చనిపోయి మనకంటె ముందుగా భూలోకమును విడిచిన మన ప్రియులను సంతోషముతో తిరిగి కలిసికొనే ప్రదేశమది.

నిజమైన దేవుని బిడ్డ ఎప్పుడు దేవునితో చిరకాలము కలిసియుందునా యని ఆ మహిమకరమైన దినము గూర్చి ఎదురుచూచుచుండును.

* * *

* ఇప్పుడు నీవు యదార్ద సత్యాన్ని తెలిసికొన్నావు. నీ స్పందన ఎలా ఉండబోతుంది?

* నిన్నును, నీ పాపములను క్షమించి దేవుని బిడ్డగా నిన్ను చేసికొనుమని ప్రభువైన యేసుక్రీస్తును అడుగుతూ ప్రార్దించావా?

* దేవుడు నీ హృదయముతో మాట్లాడుచుండగా ఆ ప్రార్దన చేయుటకు సమయమిదే.

* మనలో ఎవరెప్పుడు చనిపోయి, ఈ లోకమును విడిచిపెట్టుదుమో చెప్పలేము.

* ఈ దినాలలో ఒకరోజు ఈ భూమిపై మన ఆఖరి రోజు కావచ్చు.

* ఆ దినము రాక ముందే నీ పాపములు క్షమింపబడుట యొక్క నిశ్చయత కలుగజేసికొని దేవుని కలిసికొనుటకు సిద్దపడు.

* * *

Sunday School Children Photo Gallery



.





Sarvonnathuni Shubhaagamanam Telugu Christian Songs Album

Album:Sarvonnathuni Shubhaagamanam


1.Track    Download

2.Track    Download

3.Track    Download

4.Track   Download

5.Track    Download

6.Track   Download

7.Track   Download

8.Track    Download


9.Track     Download

Naa Pranam Telugu Christian Audio Songs Album

Album:  NA PRANAM


1.Track    Download

2.Track    Download

3.Track    Download

4.Track   Download

5.Track    Download

6.Track   Download

7.Track   Download

8.Track    Download


9.Track     Download

10.Track    Download


Swasha Telugu Christian Audio Songs Album

Album:  SWASHA


1.Track    Download

2.Track    Download

3.Track    Download

4.Track   Download

5.Track    Download

6.Track   Download

7.Track   Download

8.Track    Download


Christmas Sandadi Telugu Audio Songs Album

Album: CHRISTMAS SANDADI

1.INTRO   Download

2.BETHLEHAM BETHLEHAM   Download

3.AHAANDAME   Download

4.BETHLEHAM   Download

5.CHRISTMAS   Download

6.JAI   Download

7.POOJINCHEDAM  Download

8.STHOTRA   Download

9.STOTRAMU   Download

10.YESU PUTTENU   Download

11.YESU PUTTENU   Download

12.END   Download

Faith Telugu Christian Audio Songs Album

Album:  FAITH


1.Track    Download

2.Track  Geetha Madhuri    Download

3.Track    Download

4.Track   Download

5.Track    Download

6.Track   Download

7.Track   Download

8.Track    Download


9.Track   Download

10Track    Download

Karunamayudu Telugu Christian Audio Songs

Album: Karunamayudu

Music : Joseph, V. Krishnamoorthy, B. Gopalam
Director : A. Bhimsingh
Singers : S.P. Balasubrahmanyam, V. Ramakrishna
Year : 1978

1.Poovulakanna    Download
Singers:V Ramakrishna

2.Devudu Ledani    Download
Singers:S P Balasubrahmanyam

3.Davidhu Tanaya Hosanna   Download

4Kadilindhi Karunaratham   Download
Singers:S P Balasubrahmanyam

Roojantha Audio Songs Telugu Album

Album:  ROOJANTHA


1. ROOJANTHA    Download
  
2 SANNU     Download
  
3 ADIYU NEEVEY  Download
  
4 ASCHARYA   Download
  
5 VILUVAINADI   Downolad
  
6 PREMA   Download
  
7 NINDU    Download
  
8 CHEEKATI   Download
  
9 Adiyu Remix  Download


Nee Rajyam Audio Songs Album (2010)

Album : NEE RAAJYAM (2010)

Singers : Sharon Sisters

1. Siddhapadudaam   Download

2. Nee Raajya    Download

3. Koniyaadedhanu  Download

4. Parishuddha Devaa  Download

5. Yehovah Mahima  Download

6. Goppa Aishwaryamu Kante  Download

7. Nee Chethi Kaaryamulu  Download

8. Yesu Nee Matalu   Download

9. Kaalamu Ledika   Download

Tuesday, 24 November 2015

దావీదు విజయము స్కిట్














 Download

Davidu Vijayam Skit Telugu pdf

దావీదు విజయము స్కిట్